ETV Bharat / sports

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్​లో ధావన్​కు ఛాన్స్​ దక్కేనా!

author img

By

Published : Sep 7, 2021, 4:15 PM IST

యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్​(ICC T20 World Cup) స్క్వాడ్​ను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) బుధవారం ప్రకటించనుంది. ఈ మేరకు 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్(India T20 World Cup Squad)​ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు సమాచారం.

T20 WC: All eyes on Washington Sundar as Indian selectors gear up to pick squad
ICC T20 World Cup: టీమ్ఇండియా ప్రపంచకప్​ జట్టు ఇదేనా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup) పాల్గొనే జట్టును భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. కరోనా ప్రోటోకాల్​ను దృష్టిలో ఉంచుకొని.. టీ20 ప్రపంచకప్​లో పాల్గొనేందుకు 15మందితో కూడిన జట్టును(India T20 World Cup Squad) సెలెక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవలే గాయం బారిన పడిన వాషింగ్టన్​ సుందర్​ ప్రస్తుతం కోలుకోగా.. మరోవైపు ధావన్​ను జట్టులోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ధావన్​కు ఛాన్స్​ దక్కేనా?

కేఎల్​ రాహుల్​, రోహిత్​ శర్మ ఓపెనర్లతో పాటు విరాట్​ కోహ్లీ కెప్టెన్​గా.. మూడో బ్యాటింగ్​ స్థానంలో సూర్య కుమార్​ యాదవ్​ను ఎంచుకోవచ్చు. అయితే ఐసీసీ ఈవెంట్లలో శిఖర్​ ధావన్​ను సెలెక్టర్లు పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఈ నేపథ్యంలో ధావన్​ ఏ స్థానంలో బ్యాటింగ్​కు వస్తాడనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ధావన్​ను ఓపెనర్​గా.. కేఎల్​ రాహుల్​ మిడిల్​ ఆర్డర్​లో ఆడే అవకాశం ఉంది. అయితే, ఇటీవల కాలంలో ధావన్​ ఫిట్​గా లేడని.. అతడి స్థానంలో పృథ్వీషా ఎంపిక బాగుంటుందని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కోలుకుంటేనే జట్టులో స్థానం!

చేతి వేలి గాయం కారణంగా ఇప్పటికే ఐపీఎల్​ నుంచి తప్పుకున్న ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​.. టీ20 ప్రపంచకప్​ నాటికి కోలుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సుందర్​ కోలుకోగడని బీసీసీఐ వైద్య బృందం సూచిస్తే.. అతడిని జట్టులోకి ఎంపిక చేయొచ్చు.

సుందర్​ స్థానంలో మరొకరిని భర్తీ చేయడం సెలెక్టర్లకు పెద్ద తలపోటుగా మారింది. ఒకవేళ సుందర్​ స్థానంలో అశ్విన్​ను ఎంపిక చేయాలని అనుకున్నా.. అతడు టీ20ల్లో ఆడి చాలా కాలమైంది. ఒకవేళ అశ్విన్​ను పక్కన పెడితే.. సుందర్​ స్థానంలో జయంత్​ యాదవ్​ను పరిశీలించే అవకాశం ఉంది. అశ్విన్​, జయంత్​ యాదవ్​లు కాకుండా ఫామ్​లో ఉన్న మరొక ఆఫ్​ స్పిన్నర్ లేరు. ​

ఈ ఏడాది ఇంగ్లాండ్​, శ్రీలంకలతో సిరీస్​లలో తన బ్యాటింగ్​తో ఆకట్టుకున్న ఇషాన్​ కిషన్​.. టీ20 ప్రపంచకప్​ జట్టులో అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే.. మిడిల్​ ఆర్డర్​లో శ్రేయస్​ అయ్యర్​, సూర్యకుమార్​ యాదవ్​ పోటీ పడొచ్చు.

ఆల్​రౌండర్లుగా..

ఆల్​రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, హార్దిక్​ పాండ్యాలకు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. కృనాల్​ పాండ్యా, శార్దూల్​ ఠాకూర్​లనూ పరిశీలించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో శార్దూర్​ ఠాకూర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కూడా శార్దూల్​ ఠాకూర్​నే ఎంచుకోవచ్చు. ​

బౌలింగ్​ లైనప్​లో..

బౌలింగ్​ లైనప్​ స్పిన్​ విభాగంలో యుజ్వేంద్ర చాహల్​తో పాటు రాహుల్​ చాహర్​, వరుణ్​ చక్రవర్తి మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. గత ఐపీఎల్​ సీజన్లలో రాహుల్​ చాహర్​, వరుణ్​ చక్రవర్తి తమను తాము నిరూపించుకున్నారు. కానీ, వీరిద్దరూ అంతర్జాతీయ టోర్నీల్లో కొంత నిలకడ సాధించాల్సి ఉంది.

ఫాస్ట్​ బౌలర్లుగా జస్ప్రిత్​ బుమ్రా, మహ్మద్​ షమీ జట్టులో ఉంటారు. వీరిద్దరూ కాకుండా మరో పేసర్​ స్థానానికి భువనేశ్వర్​ కుమార్​, దీపక్​ చాహర్​లో ఒకరికి ఛాన్స్​ ఇవ్వొచ్చు. వీరితో పాటు ఉమేశ్​ యాదవ్​, మహ్మద్​ సిరాజ్​లను పరిశీలించే అవకాశం ఉంది. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​లో అక్టోబరు 24న పాకిస్థాన్​తో తొలి మ్యాచ్​లో టీమ్ఇండియా తలపడనుంది.

టీమ్ఇండియా స్క్వాడ్ రిజర్వ్​ ఆటగాళ్లతో పాటు​ (అంచనా):

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్​ యాదవ్​, జస్ప్రిత్​ బుమ్రా, మహ్మద్​ షమి, భువనేశ్వర్​ కుమార్​, యుజ్వేంద్ర చాహల్​, దీపక్​ చాహర్​, శిఖర్​ ధావన్​, ఇషాన్​ కిషన్​, వాషింగ్టన్​ సుందర్​, రాహుల్​ చాహర్​, చేతన్​ సకారియా, శార్దూల్​ ఠాకూర్​, ఉమేశ్​ యాదవ్​, వరుణ్​ చక్రవర్తి, కృనాల్ పాండ్యా, పృథ్వీషా.

ఇదీ చూడండి.. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.