ETV Bharat / sports

Champions Trophy: పాకిస్థాన్​కు టీమ్​ఇండియా.. నిర్ణయం అప్పుడే

author img

By

Published : Nov 17, 2021, 8:08 PM IST

2025 Champions Trophy venue
పాక్​లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ

పాకిస్థాన్​లో జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై (2025 Champions Trophy news) భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా అక్కడికి టీమ్​ఇండియా వెళ్లాలా? వద్దా? నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న (2025 Champions Trophy news) నేపథ్యంలో టీమ్​ఇండియా హాజరవుతుందా? లేదా? అనే అంశంపై భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆ దేశంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతర్జాతీయ మ్యాచ్​లు జరిగేటప్పుడు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లినప్పుడు భద్రత విషయంలో అక్కడి పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా చాలా జట్లు వెనక్కి తిరిగివచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. గతంలో క్రీడాకారులపై దాడులు జరిగడం వల్ల ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన చెందాల్సి వస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:Ind Vs Nz: టాస్​ గెలిచిన టీమ్​ఇండియా.. న్యూజిలాండ్​ బ్యాటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.