ETV Bharat / sports

'అతడిలో ఆ రెండు క్వాలిటీస్​ కచ్చితంగా ఉండాలి - అది నాకు చాలా ముఖ్యం'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 4:09 PM IST

Smriti Mandhana Husband Qualities : టీమ్ఇండియా మహిళల జట్టులో మేటి ప్లేయర్​గా రాణిస్తోంది స్టార్​ క్రికెటర్​ స్మృతి మంధాన. ఈమె ఆట తీరుకే కాకుండా తన అందానికి ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా ఓ ప్రోగ్రాంలో ఆమె తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను తెలిపింది. ఇంతకీ అవేంటంటే?

Etv Bharat
Etv Bharat

Smriti Mandhana Husband Qualities : టీమ్​ఇండియా మహిళల జట్టు ప్లేయర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో ప్రేక్షుకలను అబ్బురపరిచే ఈ స్టార్​ క్రికెటర్​, తన అందంతోనూ యూత్​లో మంచి క్రేజ్​ సంపాదించుకుంది. ఇటీవలే ఇంగ్లాండ్,ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించింది. ఇలా తనకంటూ క్రికెట్ హిస్టరీలో ఓ స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈ యంగ్ ప్లేయర్​ అమితాబ్​ బచ్చన్ హోస్ట్​గా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్​కు వెళ్లింది. ఇందులో ఆమెతో పాటు టీమ్ఇండియా పురుషుల జట్టు ప్లేయర్ ఇషాన్ కిషన్​ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ హోస్ట్ అడిగిన ప్రశ్నలతో పాటు ఆడియెన్స్​ అడిగిన వాటిని ఆన్సర్స్​ ఇస్తూ సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని స్మృతిని షాకింగ్ ప్రశ్న అడిగారు.

'మీకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్​ ఉండాలని కోరుకుంటారు' అంటూ ఆ ఫ్యాన్స్ అడిగారు. దానికి స్మృతికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు సిగ్గుపడింది. ఆ తర్వాత బదులిచ్చింది. " ఇలాంటి ప్రశ్న మీరు అడుగుతారని నేను అసలు ఊహించలేదు. అయితే నాకు మాత్రం అతడు మంచి అబ్బాయి అయి ఉండాలి. అంతే కాకుండా నా కెరీర్​ను అర్థం చేసుకోవాలి. అలాగే కేరింగ్‌గా కూడా ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ అతడిలో కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నా కెరీర్​ కారణంగా ఓ అమ్మాయిగా నేను అతడికి నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అందుకే అతడు నా పరిస్థితిని, ఆటను అర్థం చేసుకునే వాడు అయ్యుండాలి. నాకు కాబోయే భర్తలో ఈ లక్షణాలను ముఖ్యంగా చూస్తాను'' అని స్మ‌‌‌ృతి మంధాన ఆన్సర్​ చెప్పింది.

Smriti Mandhana Career : ఇక స్మృతి కెరీర్​ విషయానికి వస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె 6 టెస్టులు, 80 వ‌న్డేలు, 125 టీ20లు ఆడింది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 480 ప‌రుగులు, వ‌న్డేల్లో 3,179 ర‌న్స్ బాదింది. అంతే కాకుండా పొట్టి ఫార్మాట్‌లో 2,998 ప‌రుగులు సాధించింది. ఇక బీసీసీఐ తొలిసారి నిర్వ‌హించిన మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్​లో మంధాన రికార్డు ధ‌ర‌తో చ‌రిత్ర సృష్టించింది. ఆమెను ప్రముఖ ఫ్రాంచైజీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు రూ.3.4 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

అలా చేస్తే మహిళా క్రికెట్​కు తిరుగుండదు- WPL 2024లో ఆ మార్పు చేయాలి! : స్మృతి మంధాన

WPL 2024 కప్పు మాదే!- అభిమానుల ఆనందమే మా లక్ష్యం : RCB కెప్టెన్ స్మృతి మంధాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.