ETV Bharat / sports

గోవా బీచ్​లో సచిన్ సందడి.. మత్స్యకారులతో కలిసి చేపలు పడుతూ..

author img

By

Published : Nov 10, 2022, 9:56 AM IST

దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ తన కుమారుడు అర్జున్​తో కలిసి బీచ్​లో సరదాగా గడిపారు. అక్కడి మత్య్సకారులతో కలిసి చాపలు పట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

Sachin tendulkar in Goa beach
గోవా బీచ్​లో సచిన్ సందడి.

సాధారణంగా సెలబ్రిటీలకు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ఎంజాయ్ చేసే సమయం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే విరామ సమయం దొరికితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమకిష్టమైన పనులు చేస్తూ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్​తో సరదాగా గడిపేస్తుంటారు. అలాంటి వారిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్​ ఒకరు.

ఆయన తాజాగా తన కుమారుడు అర్జున్‌తో కలిసి గోవా బీచ్​కు వెళ్లిన అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బీచ్‌లోని మత్య్సకారులతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై మెళుకువలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేశారు. అనంతరం బీచ్‌ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్‌లో చేపలను ఫ్రై చేయించుకుని కుమారుడితో కలిసి తింటూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాస్టర్​ తన ఇన్​స్టాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సచిన్‌ సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి: ఇదా.. హార్దిక్​ పాండ్య ఫిట్​నెస్​ మంత్ర?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.