ETV Bharat / sports

WPLలో నిరాశపరిచిన స్మృతి.. ఒక్కో పరుగు కోసం RCBకి రూ.2 లక్షలు ఖర్చు!

author img

By

Published : Mar 22, 2023, 9:23 AM IST

Smriti Mandhana
Smriti Mandhana

డబ్ల్యూపీఎల్​ తొలి సీజన్​లో​ స్మృతి మంధాన.. బ్యాటర్​తో పాటు కెప్టెన్​గానూ విఫలమైంది. ఎనిమిది మ్యాచుల్లో కేవలం 149 పరుగులే చేసింది. దీంతో ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్​ చేస్తున్నారు. ఆమె ఒక్కో పరుగు కోసం ఆర్సీబీ రూ.2 లక్షలు ఖర్చు చేసిందని కామెంట్లు పెడుతున్నారు. ఏమిటీ లెక్క?

మహిళల ప్రీమియర్​ లీగ్​లో తొలి సీజన్​లో లీగ్​ మ్యాచులు ముగిశాయి. దిల్లీ క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్​కు దూసుకెళ్లింది. మరో రెండు జట్లు ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్​ జట్లు ఫ్లేఆఫ్స్​కు చేరుకున్నాయి. ఈ రెండింటిలో ఒక జట్టు ఫైనల్​లో దిల్లీ టీమ్​తో తలపడనుంది. కానీ ఈ తొలి సీజన్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు.. ఘోర పరభవాన్ని మూటగట్టుకుంది. ఎనిమిది లీగ్​ మ్యాచుల్లో కేవలం రెండే గెలిచి ఇంటి బాట పట్టింది.

అయితే ఈ సీజన్​కు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంఛైజీ.. టీమ్​ఇండియా మహిళా క్రికెటర్​ స్మృతి మంధానను రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ స్మృతినే. దీంతో ఒక్కసారి స్మృతిని నెట్టింట లక్కీ గర్ల్​ అంటూ కామెంట్లు పెట్టారు. టోర్నీకి ముందు స్మృతిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆర్సీబీ అభిమానులు. కానీ స్మృతి మాత్రం.. డబ్ల్యూపీఎల్​లో పూర్తిగా నిరాశపరించింది. ఒక్క మ్యాచ్​లో కూడా హాఫ్​ సెంచరీ కాదు కదా.. 40 పరుగులు కూడా సాధించలేదు. ఎక్కడా తన మార్క్​ చూపించలేదు. అటూ బ్యాటర్​గానే కాకుండా.. కెప్టెన్​గా విఫలమైంది. కేవలం రెండు మ్యాచుల్లోనే ఆర్సీబీని గెలిపించింది. ఆమె మొత్తం ఎనిమిది మ్యాచుల్లో 18.62 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఆమె స్కోర్లను చూసుకుంటే 35, 23, 18, 4, 8, 0, 37, 24.

మరోవైపు.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్‌ను అందుకుంది. ఆ జట్టును ఆరు మ్యాచ్‌ల్లో గెలిపించుకుంది. దాంతో ఆమెతో పోలికను తీసుకొస్తూ ఆర్సీబీ అభిమానులు స్మృతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు నెట్టింట స్మృతిని తెగ ట్రోల్​ చేస్తున్నారు. స్మృతి ఒక్కో పరుగుకు ఆర్సీబీ రూ.2.28 లక్షలు ఖర్చు చేసిందని అంటున్నారు.

ఏమిటీ లెక్క?
రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫ్రాంఛైజీ.. తమ టీమ్​పర్స్​లో 28.33 శాతాన్ని స్మృతి కోసం వెచ్చించింది. రూ.3.40 కోట్లతో ఆమెను వేలంలో కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్​లో స్మృతి కేవలం 149 పరుగులే చేసింది. దీంతో స్మృతి చేసిన ఒక్కో పరుగు కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. రూ.2,28,187 రూపాయలు వెచ్చించిందన్నమాట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.