ETV Bharat / sports

IPL 2022: ముంబయి ఇండియన్స్​ @9967 కోట్లు!

author img

By

Published : Apr 27, 2022, 8:01 AM IST

IPL Franchise rate
ముంబయి ఫ్రాంచైజీ విలువ

క్రికెట్​లో ఐపీఎల్​కు ఉండే క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2008లో ఈ మెగాలీగ్​ ప్రారంభమైనప్పుడు.. ఒక జట్టు సగటు విలువ రూ.291 కోట్లు. కానీ ఇప్పుడు దాని విలువ దాదాపు 27 రెట్లు పెరగడం విశేషం. ఆ వివరాలను తెలుసుకుందాం..

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ మొదలైనపుడు ఫోర్బ్స్‌ అంచనాల ప్రకారం ఇందులో ఒక జట్టు సగటు విలువ రూ.291 కోట్లు. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే సంస్థ ఓ టీ20 సగటు విలువను ఎంతకు లెక్క కట్టిందో తెలుసా? అక్షరాలా రూ.7975 కోట్లు. అంటే ఆరంభ సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు టీ20 జట్టు విలువ దాదాపు 27 రెట్లు పెరగడం విశేషం.

ఆర్థిక విషయాలకొస్తే ప్రపంచ క్రికెట్లో మిగతా లీగ్‌లు ఏవి కూడా టీ20 కు దరిదాపుల్లో లేవు. జట్ల విలువలో వార్షిక పెరుగుదల పరంగా చూస్తే ప్రపంచంలో మరే లీగ్‌ కూడా టీ20 అంత వేగంగా వృద్ధి చెందలేరు. అమెరికా కేంద్రంగా జరిగే ఎన్‌ఎఫ్‌ఎల్‌ (రగ్బీ), ఎన్‌బీఏ (బాస్కెట్‌బాల్‌) కూడా ఈ విషయంలో టీ20 కన్నా వెనకే ఉన్నాయి. టీ20లో వార్షిక వృద్ధి రేటు 24 శాతం కాగా.. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఎన్‌బీఏల్లో ఇది వరుసగా 10, 16 శాతంగా ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక విలువ కలిగిన జట్టు ముంబయి ఇండియన్సే. 9,967 కోట్ల విలువతో అది అగ్రస్థానంలో కొనసాగుతోంది. చెన్నై (రూ.8817 కోట్లు), కోల్‌కతా (రూ.8434 కోట్లు) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లోనే కొత్తగా టీ20 లోకి అడుగు పెట్టిన రెండు జట్లలో.. లఖ్‌నవూను సంజీవ్‌ గోయెంగా గ్రూప్‌ రూ.7285 కోట్లకు, గుజరాత్‌ను సీసీవీ క్యాపిటల్‌ రూ.5750 కోట్లకు కొనుగోలు చేశాయి.

ఇదీ చూడండి: IPL 2022: ధర ఎక్కువ.. ఆట మాత్రం తక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.