ETV Bharat / sports

భారత జట్టుపై కైఫ్​ ట్వీట్​.. కోహ్లీ ఫ్యాన్స్​ ఫైర్​

author img

By

Published : Mar 15, 2022, 11:58 PM IST

Mohammad Kaif
మహ్మద్​ కైఫ్

Mohammad Kaif: టీమ్​ఇండియా టెస్టు జట్టుపై మాజీ క్రికెటర్​ మహమ్మద్​ కైఫ్​ చేసిన వ్యాఖ్యల వివాదానికి తెరతీశాయి. కైఫ్​ వ్యాఖ్యలపై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కైఫ్​ ఏమన్నాడంటే..

Mohammad Kaif: శ్రీలంకతో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించడంపై పలువురు మాజీలు అభినందనలు తెలిపారు. అయితే మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కెప్టెన్​ రోహిత్​ శర్మ, కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ సారథ్యంలో ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు జట్టు రూపొందుతుందన్నాడు. ఈ మేరకు కైఫ్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. ఈ ట్వీట్​పై కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • KL, Rohit, Vihari, Kohli, Iyer, Pant, Jadeja, Ash, Bumrah, Shami and many No.11 options ... Suddenly, it all looks fine. Under Rohit and Dravid, a world beating Test unit is taking shape.

    — Mohammad Kaif (@MohammadKaif) March 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కైఫ్​ ప్రస్తుత కెప్టెన్​కే పూర్తి గుర్తింపును ఇస్తున్నాడని.. ఈ జట్టంతా విరాట్​ కోహ్లీ సారథ్యంలోనే తయారయిందని ఫ్యాన్స్​ కౌంటర్ ఇచ్చారు. టెస్టు ర్యాకింగ్స్​లో ఏడో స్థానంలో ఉన్న జట్టును కోహ్లీ.. మొదటి స్థానానికి తీసుకెళ్లాడని మరో ఫ్యాన్​ రిప్లై ఇచ్చాడు.

​ఇంగ్లాండ్​తో భారత్ జులైలో ఐదు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. సిరీస్ గతంలోనే ఆడాల్సి ఉండగా.. ​ కొవిడ్​ కారణంగా రద్దు అయ్యింది.
ఇదీ చదవండి: IPL 2022: ముంబయికి ఎదురుదెబ్బ.. స్టార్​ ప్లేయర్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.