ETV Bharat / sports

టీ20 ప్రపంచ కప్​ కంటే మాకు అదే ముఖ్యం: రోహిత్​ శర్మ

author img

By

Published : Oct 15, 2022, 8:53 PM IST

jasprit bumrah ICC T20 world cup 2022
jasprit bumrah ICC T20 world cup 2022

గాయల కారణంగా జట్టుకు దూరమైన జస్​ప్రీత్ బుమ్రాపై టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్​ కప్​ కంటే బుమ్రా ఆరోగ్యమే ముఖ్యమని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే..

ICC T20 World Cup 2022 : ఆదివారం నుంచి టీ20 ప్రపంచ కప్​ మొదలు కాబోతుంది. స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా లేకుండానే టీమ్​ ఇండియా బరిలోకి దిగనుంది. అయితే ఈ విషయమై భారత్​ జట్టు సారథి రోహిత్ శర్మ స్పందించాడు. వరల్డ్​ కప్​ కంటే బుమ్రా ఆరోగ్యం మరింత ముఖ్యం అని చెప్పాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి తీసుకుంటూ ఆల్​ ఇండియా సీనియర్​ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

"బుమ్రా గాయాలపై మేము చాలా మంది నిపుణులను కలిశాం. కానీ వారి దగ్గర నుంచి ఆశాజనకమైన జవాబు రాలేదు. వరల్డ్​ కప్​ ముఖ్యమే. కానీ దానికంటే బుమ్రా ఆరోగ్యం ఇంకా ముఖ్యం. అతడికి ఇప్పుడు కేవలం 27-28 సంవత్సరాలే. అయితే, మేము అలాంటి రిస్క్​ తీసుకోదలచుకోలేదు. ఇంకా అతడు చాలా క్రికెట్​ ఆడి.. భారత్​కు మరిన్ని విజయాలు అందించాల్సి ఉంది" అని రోహిత్​ శర్మ ఓ క్రీడా ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

గత ఏడాది నవంబర్​లో జరిగిన వరల్డ్​ కప్​ తర్వాత మహ్మద్​ షమీ టీ20 క్రికెట్​ ఆడలేదు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్​లు కూడా కొవిడ్​ కారణంగా ఆడలేక పోయాడు. ఇక మహ్మద్​ సిరాజ్​, శార్దుల్​ ఠాకుర్​ స్టాండ్​బైలుగా ఉన్నారు.

టీ20 వరల్డ్​ కప్​ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్​ రాహుల్(వైస్​ కెప్టెన్), విరాట్​ కోహ్లీ, సూర్యకుమార్​ యాదవ్, దీపక్ హుడా, రిషబ్​ పంత్(వికెట్​ కీపర్), దినేశ్​ కార్తీక్(వికెట్​ కీపర్), హార్దిక్ పాండ్య, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్​ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్​ పటేల్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ.

ఇవీ చదవండి: పొట్టి కప్పు సమరం.. పైచేయి ఎవరిది?.. రోహిత్ సేనకు గెలిచే సత్తా ఉందా?

భారత క్రికెట్​ బోర్డుకు రూ.995 కోట్లు నష్టం.. ఇదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.