ETV Bharat / sports

గుజరాత్​కు షాక్.. ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం

author img

By

Published : May 6, 2022, 11:25 PM IST

Updated : May 6, 2022, 11:30 PM IST

IPL 2022
IPL 2022

IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జైత్రయాత్రకు ముంబయి బ్రేక్​ ఇచ్చింది. ఆ జట్టుతో జరిగిన మ్యాచ్​లో 5 పరుగుల తేడాతో రోహిత్​ సేన విజయం సాధించింది.

IPL 2022: మెగా టీ20 టోర్నీలో ప్రస్తుతం టాప్‌-1లో ఉన్న గుజరాత్‌ జట్టుకు ముంబయి షాకిచ్చింది. ఆఖరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రోహిత్​ సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. వృద్ధీమాన్‌ సాహా (55; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభమన్ గిల్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ముంబయి బౌలర్లలో మురుగన్ అశ్విన్‌ రెండు, పొలార్డ్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి ఇండియన్స్​ ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఇషాన్​ కిషన్​, రోహిత్ శర్మ శుభారంభం అందించడం వల్ల నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (45; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో టిమ్‌ డేవిడ్ (44; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (13), తిలక్‌ వర్మ (21), పొలార్డ్ (4) పరుగులతో నిరాశ పరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, అల్జరీ జోసెఫ్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌ తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి: డేవిడ్‌ వార్నర్‌.. సన్​రైజర్స్​పై స్వీట్‌ రివెంజ్‌..

Last Updated :May 6, 2022, 11:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.