ETV Bharat / sports

ఐపీఎల్: కొవిడ్ రిపోర్ట్​ ఉంటేనే వాంఖడేలోకి ఎంట్రీ

author img

By

Published : Apr 10, 2021, 4:26 PM IST

Updated : Apr 10, 2021, 4:37 PM IST

వాంఖడేలో జరిగే మ్యాచ్​లకు వచ్చే అధికారులకు కొవిడ్ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది బీసీసీఐ. ఇటీవల 10 మంది అధికారులకు కరోనా పాజిటివ్​గా తేలడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2021: Negative RT-PCR Test Report Mandatory For Entry into Wankhede
ఐపీఎల్: కొవిడ్ రిపోర్ట్​ ఉంటేనే వాంఖడేలోకి ఎంట్రీ

కరోనా ప్రభావం ఉన్నా సరే ఐపీఎల్ ఘనంగా ప్రారంభమైంది. చెన్నైలో శుక్రవారం తొలి పోరు​ జరగ్గా, శనివారం నుంచి ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్​లు జరగనున్నాయి. అయితే ఈ మైదానంలో మ్యాచ్​లు లైవ్​గా చూసేందుకు వచ్చే అపెక్స్ కౌన్సిల్​ సభ్యులు, ఇతర అధికారులకు బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల 10 మంది అధికారులకు పాజిటివ్​గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాచ్​ కోసం వచ్చే అధికారులు, కొవిడ్ ఆర్​టీ పీసీఆర్ పరీక్ష రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలి. నెగటివ్ ఉంటేనే లోపలికి వారిని అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ఈ సీజన్​లో భాగంగా వాంఖడేలో, ఏప్రిల్ 10 నుంచి 25 వరకు మొత్తం 10 మ్యాచ్​లు జరగనున్నాయి. శనివారం తొలి పోరులో చెన్నై సూపర్​కింగ్స్- దిల్లీ క్యాపిటల్స్​ తలపడనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్​ మొదలవుతోంది.

Last Updated : Apr 10, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.