IPL 2021: హైదరాబాద్​పై దిల్లీ ఘన విజయం

author img

By

Published : Sep 22, 2021, 10:59 PM IST

delhi capitals

సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది.

ఐపీఎల్​ తొలి దశలో పేలవ ప్రదర్శన చేసిన సన్​రైజర్స్​ హైదరాబాద్​కు రెండో దశ కూడా కలిసిరాలేదు. దిల్లీ క్యాపిటల్స్​తో ఆడిన తన తొలి మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

సన్​రైజర్స్​ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని పంత్​ సేన 17.5 ఓవర్లలోనే​ ఛేదించింది. శిఖర్​ ధావన్​(42), శ్రేయస్​ అయ్యర్​(47) నాటౌట్​, రిషభ్​ పంత్​(35) నాటౌట్​ వల్ల దిల్లీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. సన్​రైజర్స్​ బౌలర్లలో రషీద్​ఖాన్ , ఖలీల్​ అహ్మద్​ తలో వికెట్​ తీశారు.

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ వార్నర్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే నోర్జే వేసిన ఫస్ట్‌ ఓవర్‌లోనే ఔటయ్యాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా (18) కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. మరోవైపు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18) కూడా ఆకట్టుకోలేకపోయాడు. స్వల్ప వ్యవధిలో రెండు జీవనాధారాలు లభించినా భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమయ్యాడు. మనీశ్‌ పాండే (17), కేదార్‌ జాదవ్‌ (3), జాసన్‌ హోల్డర్‌ (10) రాణించలేదు. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్ (22) రాణించడం వల్ల హైదరాబాద్‌ ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. దిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2, అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశారు.

ఇదీ చూడండి: IPL 2021: సన్​రైజర్స్ మళ్లీ అదే తీరు​.. దిల్లీ లక్ష్యం 135

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.