ETV Bharat / sports

ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా: పంత్​

author img

By

Published : Apr 30, 2021, 1:29 PM IST

Dedicating this win to all frontline workers, says Pant
ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా

కోల్​కతా నైట్​రైడర్స్​పై విజయాన్ని కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు అంకితమిస్తున్నట్లు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ రిషబ్​ పంత్​ వెల్లడించాడు. ఈ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో లీగ్​లో ముందుకుసాగుతామని తెలిపాడు.

అహ్మదాబాద్​ వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. అయితే ఈ గెలుపును కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు అంకితమిచ్చాడు దిల్లీ జట్టు కెప్టెన్​ రిషబ్​ పంత్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించాడు.

  • Absolutely thrilled with the way the team played today. Clinical performance from everyone and we'll take this confidence into the next games!! Dedicating this win to all the frontline workers across India who are doing their best to keep us safe 🙏🏽@DelhiCapitals #RP17 pic.twitter.com/G1NC1Oa3NA

    — Rishabh Pant (@RishabhPant17) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కోల్​కతా టీమ్​తో జరిగిన మ్యాచ్​లో మా జట్టు ఆడిన ఆటతీరు థ్రిల్లింగ్​కు గురి చేసింది. ఈ ఆటలో గెలుపుతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని లీగ్​లోని తదుపరి ఆటల్లోనూ కొనసాగిస్తాం. అయితే మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి కరోనాపై పోరాటం చేస్తోన్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం".

- రిషబ్ పంత్ ట్వీట్​

ఈ మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 7 వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఆండ్రూ రసెల్‌ (45 నాటౌట్‌; 27 బంతుల్లో 2×4, 4×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేదనలో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' పృథ్వీ మెరుపులతో దిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఇదీ చూడండి.. 'కోల్​కతా నైట్​రైడర్స్​ ఆడే మ్యాచ్​లు బోర్​ అబ్బా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.