ETV Bharat / sports

'మిగిలిన ఐపీఎల్​ మ్యాచ్​ల్లో మా ఆటగాళ్లు ఆడకపోవచ్చు!'

author img

By

Published : May 11, 2021, 11:01 AM IST

కొవిడ్ కారణంగా ఐపీఎల్​ వాయిదా పడింది. దీంతో మిగిలిన మ్యాచ్​లను నిర్వహించడానికి త్వరలోనే కొత్త వేదికను ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. అయితే ఈ మ్యాచ్​ల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం లేదని ఇంగ్లాండ్​ బోర్డు ప్రకటించింది.

ipl-2021-england-players-unlikely-to-feature-in-rescheduled-tournament-says-ecb-director-ashley-giles
'మిగిలిపోయిన ఐపీఎల్​ మ్యాచ్​ల్లో మా ఆటగాళ్లు ఆడరు!'

ఐపీఎల్​లో మిగిలిపోయిన మ్యాచ్​ల్లో తమ దేశ ఆటగాళ్లు ఆడకపోవచ్చని తెలిపారు ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు డైరెక్టర్​ యాష్లే గైల్స్​. అంతర్జాతీయ క్రీడా క్యాలెండర్​ దృష్ట్యా.. బోర్డుతో సెంట్రల్​ కాంట్రాక్ట్​ ఉన్న క్రికెటర్లు ఇయాన్​ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్​ బట్లర్.. లీగ్​లో పాల్గొనబోరని వెల్లడించారు.

గత నెలలో ప్రారంభమైన ఐపీఎల్​.. కొవిడ్​ కారణంగా మే 4న నిరవధిక వాయిదా పడింది. టోర్నీ రద్దు కాలేదని.. మిగిలిపోయిన మ్యాచ్​లకు వేదికను త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నొక్కి చెప్పారు.

“టీ20 ప్రపంచ కప్​కు ముందు సన్నాహాక మ్యాచ్​ల్లో భాగంగా త్వరలోనే బంగ్లాదేశ్, పాకిస్థాన్​లతో సిరీస్​లు ఆడనుంది ఇంగ్లాండ్. మా క్రికెటర్లు ఆ మ్యాచ్​ల్లో పాల్గొంటారు. జూన్​ 2న న్యూజిలాండ్​తో జరగనున్న సిరీస్​ వేరు. సిరీస్​ నిర్ణయమయ్యే నాటికే ఐపీఎల్​లో ఆడటానికి ఆటగాళ్లు ఒప్పందం చేసుకున్నారు” అని బోర్డు డైరెక్టర్​ తెలిపారు.

కివీస్​తో సిరీస్​కు కుర్రాళ్లకు అవకాశం..

“జూన్​ 2 నుంచి న్యూజిలాండ్​తో ప్రారంభమయ్యే టెస్ట్​ సిరీస్​లో కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వనున్నాం. కివీస్​తో సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేయడానికి.. కోచ్​ సిల్వర్​వుడ్​ ఆటగాళ్లతో కలిసి పనిచేయనున్నారు” అని గైల్స్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వారు దూరమయ్యారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.