ETV Bharat / sports

'బాధలో ఉన్నా.. బంతులను బాదారు'

author img

By

Published : Oct 25, 2020, 7:51 AM IST

విషాదాన్ని దిగమింగి ఇద్దరు యువ క్రికెటర్లు తమ ఆటను యథావిధిగా కొనసాగించారు. ఓ క్రికెటర్​ తన తండ్రిని కోల్పోగా.. మరో క్రికెటర్​ తన మావయ్యను కోల్పోయాడు. ఈ ఏడాది ఐపీఎల్​ యుఏఈ వేదికగా జరుగుతున్న సందర్భంగా వారు స్వదేశానికి వెళ్లలేకపోయారు.

Nitish Rana_Mandeep Singh
'బాధలో ఉన్నా.. బంతులను బాదారు'

ఐపీఎల్‌ కోసం యూఏఈలో ఉన్న ఇద్దరు క్రికెటర్ల కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్‌ ఆటగాడు మన్‌దీప్‌ సింగ్‌ తండ్రి శనివారం ఉదయం మృతి చెందగా.. స్వదేశానికి వచ్చే వీలు లేక అతను అక్కడే ఉండిపోయాడు. తండ్రి మరణాన్ని దిగమింగి సాయంత్రం అతను సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్‌ 17 పరుగులు చేశాడు. అతడికి సంఘీభావంగా పంజాబ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు.

Nitish Rana_Mandeep Singh
మన్​దీప్

బాధలో ఉన్నా.. టాప్​ స్కోరర్​గా

మధ్యాహ్నం దిల్లీతో మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన నితీశ్‌ రాణా కుటుంబంలోనూ ముందు రోజు విషాదం చోటుచేసుకుంది. అతడి మావయ్య సురేందర్‌ మరణించాడు. ఈ బాధలోనే మ్యాచ్‌ ఆడిన రాణా.. చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు. అర్ధశతకం అయ్యాక సురేందర్‌ పేరుతో ఉన్న జెర్సీని చూపిస్తూ తన ఇన్నింగ్స్‌ను మావయ్యకు అంకితమిచ్చాడు.

Nitish Rana_Mandeep Singh
నితీశ్ రాణా

ఇదీ చదవండి:'ఈ ఓటమి మర్చిపోయి.. ముందుకెళ్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.