ETV Bharat / sports

హార్థిక్ పాండ్య, మోరిస్​కు ఐపీఎల్​ కమిటీ హెచ్చరిక

author img

By

Published : Oct 29, 2020, 11:08 AM IST

Hardik_Morris
'హార్థిక్, క్రిస్​ మోరిస్​'కు ఐపీఎల్​ కమిటీ హెచ్చరిక

బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో మితిమీరి ప్రవర్తించిన హార్థిక్​ పాండ్య, మోరిస్​ల​ను హెచ్చరించిన ఐపీఎల్​ కమిటీ.. వారిద్దరూ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది.

ముంబయి ఆల్​రౌండర్ హార్థిక్ పాండ్య, బెంగుళూరు ఆటగాడు క్రిస్​ మోరిస్​లను ఐపీఎల్​ కమిటీ హెచ్చరించింది. టోర్నీ నిబంధనలను ఉల్లంఘించి, మితిమీరి ప్రవర్తించారని తెలిపింది.

'ఆర్సీబీ ఆల్​రౌండర్ క్రిస్​ మోరిస్.. లెవల్​ 1 అతిక్రమణలో 2.5 నిబంధనను ఉల్లంఘించారు' అని ఐపీఎల్ కమిటీ తెలియజేసింది. ముంబయి ఆల్​రౌండర్ హార్థిక్​ పాండ్య లెవల్​ 1 అతిక్రమణలో 2.20 నిబంధనను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

ఐపీఎల్​లో లెవల్​ 1 ఉల్లంఘనకు పాల్పడిన ఆటగాళ్లకు ఫైన్​ విధించే అధికారం మ్యాచ్​ రిఫరీలకు ఉంటుంది. అబుదాబి వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో బెంగుళూరుపై 5 వికెట్ల తేడాతో ముంబయి ఘన విజయం సాధించింది. దీంతో దాదాపుగా ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించింది.

ఇదీ చదవండి:రవిశాస్త్రి కామెంట్లపై తీవ్ర విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.