ETV Bharat / sports

ఐపీఎల్​: ఆ విషయంలో గంగూలీ ఆశ్చర్యపడలేదు

author img

By

Published : Oct 28, 2020, 1:31 PM IST

ముంబయి-చెన్నై మధ్య జరిగిన తొలి ఐపీఎల్​ మ్యాచ్​ను ఎక్కువ మంది చూడటం తనకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదని గంగూలీ అన్నాడు. ప్రపంచంలోనే ఇదో గొప్ప టోర్నీ అని కితాబిచ్చాడు.

Ganguly_IPL Viewership
ఆ విషయంలో గంగూలీ ఆశ్చర్యపడలేదు

ఈ ఏడాది ఐపీఎల్​ తొలి మ్యాచ్​ను అత్యధికంగా 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. అయితే ఈ విషయం తనను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు. క్రికెట్​తో ప్రజల్లో జీవితంలో సాధారణ స్థితి రావాలని బోర్డు ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన టోర్నీ.. కరోనా ప్రభావంతో దాదాపు ఆరు నెలల ఆలస్యంగా యూఏఈలో ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులను ఎవరినీ అనుమతించలేదు.

"ఈ విషయం(ఐపీఎల్ వ్యూయర్​షిప్) పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ప్రజల జీవితాలను, క్రికెట్​ ఆటను సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగంగా ఐపీఎల్ నిర్వహణకు ముందడుగు వేశాం. ఈ సీజన్​ నిర్వహణ కూడా సరిగ్గా చేయగలమా లేదా అనే అనుమానంతోనే ప్రారంభించాం. కానీ బాగానే జరుగుతోంది"

- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

డబుల్​ సూపర్​ ఓవర్​ జరిగిన మ్యాచ్​ అద్భుతం

ఒకే ఆటలో రెండు సూపర్​ ఓవర్లు సాగిన మ్యాచ్​ను గుర్తుచేసుకున్న గంగూలీ... ప్రపంచంలోనే ఐపీఎల్​ ఓ గొప్ప టోర్నీ అని అన్నాడు. అక్టోబర్ 18న జరిగిన ఈ మ్యాచ్​లో ముంబయిపై పంజాబ్ అద్భుత విజయం సాధించింది.

"ఎక్కువ మంది మ్యాచ్​ను వీక్షించిన జాబితాలో ఐపీఎల్​ది ప్రత్యేక స్థానం. ఇది ఐపీఎల్​ నిర్వహణకు ఘన విజయంలాటింది. ఎన్నో మ్యాచ్​ల్లో సూపర్​ ఓవర్లు జరిగాయి. శిఖర్​ ధావన్, రోహిత్​ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. యువ ఆటగాళ్లు ప్రతిభ కనబరిచారు. పాయింట్ల పట్టికలో కింద నిలిచిన పంజాబ్​.. రాహుల్​ అధ్యర్యంలోనే పుంజుకోవడం విశేషం"

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఇదీ చదవండి:రిటైర్మెంట్​కు ఇంకా సమయం ఉంది: గేల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.