ETV Bharat / sports

ఐపీఎల్​ రిటైర్మెంట్​పై ధోనీ క్లారిటీ

author img

By

Published : Nov 1, 2020, 4:10 PM IST

ఐపీఎల్ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన ధోనీ.. వచ్చే సీజన్​లోనూ ఆడతానని చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్​కే మళ్లీ ప్రాతినిధ్యం వహిస్తానని వెల్లడించాడు.

Dhoni gaive clarity on his IPL retirement
ఐపీఎల్​ రిటైర్మెంట్​పై ధోనీ క్లారిటీ

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికిన ధోనీ.. ఈ సీజన్​ తర్వాత ఐపీఎల్​కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్​ ఆదివారం మ్యాచ్​ సందర్భంగా ఈ విషయమై స్పష్టతనిచ్చాడు.

ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన తర్వాత వ్యాఖ్యాత, ధోనీని.. 'ఇదే మీకు చెన్నైతో చివరి మ్యాచా?' అంటూ ప్రశ్నించాడు. బదులిచ్చిన మహీ.. కచ్చితంగా కాదు అంటూ ఐపీఎల్ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.

ఈ మెగాలీగ్​లో చెన్నై జట్టు వరుస ఓటములతో ప్లేఆఫ్స్​ నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచ్‌ల్లో ఐదింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఓ పక్క చెన్నై ఓడుతున్నా.. మ్యాచ్‌ల అనంతరం ధోనీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. వచ్చే సీజన్​లో అతడు ఆడటం అనుమానమేనని అందరూ అనుకున్నారు. కానీ వాటన్నింటిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.