ETV Bharat / sports

హైదరాబాద్ మ్యాచ్​లో గేల్ ఆడాలి.. కానీ!

author img

By

Published : Oct 9, 2020, 2:14 PM IST

Chris Gayle was going to play vs SRH but he had food poisoning: Anil Kumble
గేల్

హైదరాబాద్​తో మ్యాచ్​లో గేల్ ఆడాల్సిందని, ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఆడలేకపోయాడని చెప్పాడు పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే. ఈ మ్యాచ్​లో 69 పరుగుల తేడాతో సన్​రైజర్స్ విజయం సాధించింది.

హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ ఆడాల్సిందని, చివరి నిమిషంలో అతడు దూరమయ్యాడని ఆ జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లే చెప్పాడు.

ఈ పోరులో తొలుత హైదరాబాద్‌ 201 పరుగుల భారీ స్కోరు చేయగా, ఛేదనలో 132 పరుగులకే ఆలౌటైంది పంజాబ్‌. దీంతో ఈ లీగ్‌లో ఐదో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ అభిమానులు తుది జట్టు ఎంపికను తప్పుబడుతున్నారు. తరచూ విఫలమవుతున్న మాక్స్‌వెల్‌ను తీసి క్రిస్‌గేల్‌ను ఆడించాలని కోరుతున్నారు.

టోర్నీ నిర్వాహకులు గేల్‌ను ఎందుకు ఆడించడం లేదని పంజాబ్‌ కోచ్‌ కుంబ్లేను నిన్న మ్యాచ్​ జరుగుతున్న సమయంలో ప్రశ్నించారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ తుది జట్టులో ఉన్నాడని, కానీ ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కడుపునొప్పితో బాధపడుతుండటం వల్ల చివరి క్షణాల్లో తప్పుకున్నాడని స్పష్టం చేశాడు.

2009 నుంచీ ఈ మెగా టీ20 లీగ్‌ ఆడుతున్న గేల్.. ఇప్పటివరకు 125 మ్యాచ్‌లు ఆడి, 4,484 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 175 నాటౌట్‌. ఈ టోర్నీలో 326 సిక్సులు బాది అందరికన్నా ముందున్నాడు. తర్వాత బెంగళూరు బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ 219 సిక్సులతో ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.