ETV Bharat / sports

ind vs eng test: టీమ్​ఇండియా 466 ఆలౌట్- ఇంగ్లాండ్​ లక్ష్యం 368

author img

By

Published : Sep 5, 2021, 8:55 PM IST

Updated : Sep 5, 2021, 10:14 PM IST

ind vs eng test
విరాట్ కోహ్లీ

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టులో టీమ్​ఇండియాకు (ind vs eng test) 367పరుగుల భారీ ఆధిక్యం లభించింది. పంత్, శార్దుల్ అర్ధ సెంచరీలతో రాణించారు. భారత్​ రెండో ఇన్నింగ్స్​లో 466 పరుగులు చేసింది భారత్.

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 466 పరుగులకు ఆలౌట్​ అయ్యింది టీమ్​ఇండియా (ind vs eng test). రిషబ్ పంత్ (50), శార్దుల్ ఠాకూర్ (60) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో ఇంగ్లాండ్​కు 368 పరుగుల లక్ష్యాన్నిచ్చింది.

రోహిత్ శర్మ అద్వితీయ సెంచరీ (127) చేయగా, ఛతేశ్వర్ పుజారా (61) అర్ధ శతకం సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44), కేఎల్​ రాహుల్ (46)​ కూడా రాణించారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్​: 191/10

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 290/10

ఇదీ చూడండి: రోహిత్​ రికార్డు.. ఇంగ్లాండ్ గడ్డ​పై భారత్​ నుంచి ఒక్కడే

Last Updated :Sep 5, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.