ETV Bharat / sports

రోహిత్​ రికార్డు.. ఇంగ్లాండ్ గడ్డ​పై భారత్​ నుంచి ఒక్కడే

author img

By

Published : Sep 5, 2021, 9:58 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో శతకం బాదిన టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ(rohith sharma century in england ).. భారత దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్​ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. దీంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే..

rohith
రోహిత్​

ఇంగ్లాండ్​లో అద్భుత ఫామ్​లో ఉన్న టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్​ శర్మ(rohith sharma century in england) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్​ గడ్డపై దిగ్గజ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్ సాధించిన ఎక్కువ సెంచరీల(8) రికార్డును అధిగమించాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో సెంచరీ చేసిన హిట్​మ్యాన్ ఈ మార్క్​తో ప్రత్యర్థి జట్టు గడ్డపై అత్యధిక శతకాలు(9) చేసిన భారత బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ లెజండరీ బ్యాట్స్​మన్​ డొనాల్డ్​ బ్రాడ్​మన్ 11 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ​

రోహిత్​.. ఈ సెంచరీతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటంటే..

  • అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మట్లలో కలిపి 15వేల పరుగులు
  • టెస్టు ఫార్మాట్​లో 3 వేల పరుగుల మార్క్​
  • విదేశాల్లో అతడికి ఇదే తొలి టెస్టు శతకం
  • ఓపెనర్​గా అంతర్జాతీయ క్రికెట్​లో 11వేల పరుగులు
  • 2021లో అంతర్జాతీయ క్రికెట్​లో వెయ్యి రన్స్​
  • ఇప్పటివరకు ఇంగ్లాండ్​లో రెండు వేల పరుగులు
    rohith
    రోహిత్​

ఇది చివరి అవకాశం అనుకున్నా

2019లో ఓపెనర్​గా బరిలో దిగుతూ టెస్ట్​ ఫార్మాట్​ అరంగేట్రం చేశాడు రోహిత్​. ఆ సమయంలో తనను తాను నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశమని భావించినట్లు గుర్తుచేసుకున్నాడు. "బ్యాటింగ్​ ఆర్డర్​లో నా స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు, బాగా ఆడేందుకు ఇదే చివరి అవకాశమని తెలుసు. ఈ అవకాశాన్ని సవాల్​గా తీసుకున్నాను. అప్పటి నుంచి మరింత శ్రద్ధగా ఆడాను. నెట్స్​లో బాగా ప్రాక్టీస్​ చేశాను. నన్ను నేను మెరుగుపరుచుకున్నాను.అప్పుడు నేను సక్సెస్​ అవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఏమీ జరిగేవి కాదు." అని అన్నాడు.

ఇదీ చూడండి:శతకంతో రోహిత్​ జోరు- టెస్టుల్లో​ అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.