ETV Bharat / sports

Ind vs NZ: సిరీస్​పై టీమ్​ఇండియా కన్ను.. కివీస్ నిలుస్తుందా?

author img

By

Published : Nov 19, 2021, 5:31 AM IST

Updated : Nov 19, 2021, 7:12 AM IST

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌పై.. భారత్‌ జట్టు (India vs New Zealand) కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన.. శుక్రవారం రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో మిడిలార్డర్‌ తడబడగా.. రెండో టీ20లో ఆ సమస్యను అధిగమించాలని యోచిస్తోంది. అటు రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి, సిరీస్‌ సమం చేయాలని కివీస్‌ ఆరాటపడుతోంది.

Ind vs NZ
india vs new zealand

రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా, రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జరుగుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను ఒడిసిపట్టాలని భారత జట్టు వ్యూహాలు రచిస్తోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో (India vs New Zealand) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి మ్యాచ్‌ గెలిచిన టీమ్​ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించేందుకు కసరత్తు చేస్తోంది.

తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో కొన్ని లోపాలు తలెత్తగా.. వాటిపై జట్టు దృష్టిసారించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma News), కేఎల్ రాహుల్‌ (KL Rahul News) ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించగా, వన్‌ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌.. అర్ధ శతకంతో రాణించాడు. రెండో మ్యాచ్‌లోనూ ముగ్గురు జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మిడిలార్డర్​ మెరుగవ్వాలి..

అయితే మిడిలార్డర్‌ (India Team Middle Order) బ్యాటర్లు విఫలం కావడం.. జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌లో తడబడ్డాడు. తర్వాత వచ్చిన.. రిషభ్‌ పంత్ పర్వాలేదనిపించినా.. ఆరో స్థానంలో వచ్చిన వెంకటేష్‌ అయ్యర్ తన అరంగేట్రం మ్యాచ్‌లో.. రెండు బంతుల్లోనే పెవిలియన్‌ చేరాడు. తుది జట్టులో అవకాశం లభిస్తే శ్రేయాస్‌, వెంకటేశ్‌ మెరుగైన ఆటతీరు కనబర్చాలని జట్టు ఆశిస్తోంది.

బౌలింగ్ విభాగంలో సీనియర్లు భువనేశ్వర్‌ కుమార్‌, రవిచంద్రన్ అశ్విన్‌.. తమ స్థాయికి తగ్గట్టు రాణించి, చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌ మాత్రం.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొదటి మ్యాచ్‌లో గాయపడిన సిరాజ్ స్థానంలో.. మరొకరికి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.

కివీస్​ బౌలింగ్​పైనే దృష్టి..

సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే.. తప్పక గెలవాల్సిన రెండో మ్యాచ్‌ కోసం కివీస్‌ (New Zealand Tour of India 2021) కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఓపెనర్‌ గఫ్తిల్‌, వన్‌డౌన్‌లో వచ్చిన.. మార్క్‌ చప్‌మన్‌ తొలి మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరు కనబర్చడం కివీస్‌కు కలిసిరాగా.. మిడిలార్డర్‌ కూడా స్థాయికి తగ్గట్టు రాణించడం పట్ల సంతోషంగానే ఉంది. అయితే బౌలింగ్‌ విభాగంలో లోపాలను సవరించుకోవాలని భావిస్తోంది. పవర్‌ ప్లే సమయంలో భారత బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన కివీస్.. ఈ అంశంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్‌ కీలకంగా మారింది.

ఇవీ చూడండి:

IND vs NZ: 'కోహ్లీ తిరిగొచ్చినా.. మూడో స్థానంలో అతడే ఆడాలి'

IND vs NZ: 'కెప్టెన్​గా రోహిత్​ అరుదైన తప్పిదం చేశాడు'

IND vs NZ: 'బౌల్ట్‌.. నా భార్యకు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు'

Last Updated :Nov 19, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.