ETV Bharat / sports

అండర్​-19 వరల్డ్ కప్​లో కరోనా కలకలం- టీమ్​ఇండియా కెప్టెన్​కు పాజిటివ్

author img

By

Published : Jan 19, 2022, 9:04 PM IST

Updated : Jan 19, 2022, 10:17 PM IST

ICC Under-19 cricket World Cup
ICC Under-19 cricket World Cup

20:59 January 19

అండర్​-19 వరల్డ్ కప్​లో కరోనా కలకలం

వెస్టిండీస్​లో జరుగుతున్న అండర్​ 19 వరల్డ్ కప్​ టోర్నీలో కరోనా కలకలం రేపింది. టీమ్​ ఇండియా కెప్టెన్ యశ్ ధుల్ సహా మరో ఐదుగురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలింది. దీంతో ప్రపంచకప్ నుంచి వారు నిష్క్రమించారు.

ధుల్, వైస్​కెప్టెన్​ రషీద్‌తో పాటు బ్యాటర్ ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్ సిద్ధార్థ్ యాదవ్‌లు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో భారత జట్టులో 11 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

కరోనా పరీక్షలు అనంతరం ఆరుగురు ఆటగాళ్లు ఐసోలేషన్​లోకి వెళ్లారు. దీంతో ఐర్లాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లో నిశాంత్​ సిద్ధు తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

Last Updated : Jan 19, 2022, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.