ETV Bharat / sports

కామన్వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్​

author img

By

Published : Apr 27, 2021, 6:50 AM IST

six qualifiers for CWG 2022
కామన్వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్​

బర్మింగ్​ హామ్​ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్​ గేమ్స్​లో క్రికెట్​ పునరాగామనం చేయబోతోంది. మహిళా క్రికెట్​లోని 8 జట్లు బరిలో దిగుతాయని అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది.

కామన్వెల్త్​​ క్రీడల్లోకి క్రికెట్​ పునరాగమనం చేయబోతోంది. 2022 బర్మింగ్​ హామ్​ కామన్వెల్త్​ క్రీడల మహిళ క్రికెట్లో 8 జట్లు బరిలో దిగుతాయని సోమవారం ఐసీసీ ప్రకటించింది. టీ20 ఫార్మాట్​లో జరిగే టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్​, టీమ్ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికాతో పాటు కరీబియన్​ దీవుల నుంచి ఒక జట్టు అర్హత సాధించినట్లు వెల్లడించింది.

ఏప్రిల్​ 1 వరకు ఉన్న ర్యాంకింగ్స్​ ఆధారంగా ఆయా జట్లను ఐసీసీ ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జనవరిలో క్వాలిఫయింగ్​ టోర్నీ ద్వారా 8వ జట్టును ఎంపిక చేయనున్నట్లు ఐసీసీ పేర్కొంది.

"కరీబియన్​ దీవుల నుంచి ఏ జట్టు బరిలో ఉంటుందన్నది అర్హత టోర్నీ ద్వారా నిర్ణయిస్తాం. కరీబియన్​ మహిళా క్రికెటర్లు తమ దేశాల తరఫున ఆడుతున్నారు. 2022 జనవరిలో జరిగే అర్హత టోర్నీ ద్వారా 8వ జట్టును ప్రకటిస్తాం."

- అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)

1998 కౌలాంలపూర్​ కామన్వెల్త్​ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్​ను చేర్చారు. ఆ క్రీడల్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. అనంతరం కామన్వెల్త్​ క్రీడలకు క్రికెట్​ దూరంగా ఉంది.

ఇదీ చూడండి.. ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన కోల్​కతా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.