ETV Bharat / sports

IND vs SL: టాస్​ గెలిచిన శ్రీలంక.. భారత్ బ్యాటింగ్

author img

By

Published : Jul 28, 2021, 7:32 PM IST

Updated : Jul 28, 2021, 7:43 PM IST

శ్రీలంకతో జరగబోతున్న రెండో టీ20లో మొదట టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​కు కరోనా సోకిన కృనాల్ పాండ్యా సహా మరో 8 మంది గైర్హాజరయ్యారు. ఇప్పటికే సిరీస్​లో 1-0తో ముందంజలో ఉన్న ధావన్​ సేన.. ఈ మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

IND vs SL
ఇండియా vs శ్రీలంక

శ్రీలంకతో జరగుతోన్న రెండో టీ20లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది టీమ్ఇండియా. నేడు కొలంబో వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన లంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​కు కరోనా సోకిన కృనాల్ పాండ్యా సహా మరో 8 మంది గైర్హాజరయ్యారు. ఇప్పటికే సిరీస్​లో 1-0తో ముందంజలో ఉన్న ధావన్​ సేన.. ఈ మ్యాచ్​ను గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

కొత్త ఆటగాళ్లు

కరోనా కారణంగా ఈ మ్యాచ్​కు టీమ్ఇండియాకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. కృనాల్ పాండ్యాకు కరోనా సోకడం వల్ల అతడితో పాటు మరో 8 మంది ఈ మ్యాచ్ ఆడట్లేదు. దీంతో ఈ మ్యాచ్​లో నలుగురు కొత్త ఆటగాళ్లు టీ20 అరంగేట్రం చేయనున్నారు. దేవ్​దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రానా, చేతన్ సకారియా భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్​లో వారి తొలి మ్యాచ్ ఆడబోతున్నారు.

ఇక లంక తరఫున ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తన్నారు. రమేశ్ మెండిస్​తో పాటు సదీరా సమరవిక్రమ టీ20ల్లో తమ తొలి మ్యాచ్​ ఆడబోతున్నారు.

జట్లు..

భారత్

శిఖర్ ధావన్ (కెప్టెన్), దేవ్​దత్​ పడిక్కల్, సంజూ శాంసన్​, నితీష్​ రానా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైని.

శ్రీలంక:

దసున్ శనక(కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స, ధనంజయ డిసిల్వా, రమేశ్ మెండిస్, వానిందు హసరంగ, చమీక కరుణరత్నే, అకిల ధనంజయ, దుశ్మంత చమీరా, సమరవిక్రమ.

ఇదీ చదవండి: ICC Rankings: మెరుగైన భూవీ, చాహల్, చాహర్ స్థానాలు

Last Updated : Jul 28, 2021, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.