ETV Bharat / sports

Ind Vs Pak World Cup 2023 : భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు.. ఫ్యాన్స్​కు సూపర్​ ఛాన్స్​.. మీరు వెళ్తారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 2:13 PM IST

Ind Vs Pak World Cup 2023 : భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియా, పాకిస్థాన్​ మధ్య జరగనున్న మ్యాచ్​ చూసేందుకు అహ్మదాబాద్​ వెళ్లాలనుకునే వారికి గుడ్​న్యూస్​. మ్యాచ్​ రోజున ఆయా ప్రాంతాల నుంచి వందేభారత్​ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.

Ind Vs Pak World Cup 2023
Ind Vs Pak World Cup 2023

Ind Vs Pak World Cup 2023 : క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్​.. భారత్​ వేదికగా ప్రారంభమైంది. అయితే చిరకాల ప్రత్యర్థులు భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వెయిట్​ చేస్తున్నారు. అక్టోబర్​ 14వ తేదీన.. గుజరాత్​లోని నరేంద్రమోదీ స్డేడియం వేదికగా జరగనున్న దాయాదుల పోరును చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు.

India Pakistan Match World Cup : ఈ నేపథ్యంలో అహ్మదాబాద్​లోని అన్ని హోటళ్లుకు భారీ డిమాండ్​ ఏర్పడింది. ఒక్కసారిగా హోటల్​ గదుల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్‌ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది.

Ind Pak World Cup 2023 Date : భారత్‌-పాక్‌ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది భారతీయ రైల్వే. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్‌, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా అహ్మదాబాద్‌లోని హోటళ్ల ధరలు భారీగా పెరగడం, అధిక విమాన టికెట్‌ ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్‌ ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Ind Pak Match 2023 : అక్టోబర్​ 14వ తేదీన మ్యాచ్‌ ప్రారంభం కావడానికి కొన్నిగంటల ముందు ఈ ప్రత్యేక రైళ్లు సబర్మతీ, అహ్మదాబాద్ స్టేషన్లకు చేరుకుంటాయని తెలిపారు. ఈ రెండు స్టేషన్లు నరేంద్ర మోదీ స్టేడియానికి దగ్గరగా ఉండటం వల్ల అభిమానులు సులభంగా స్టేడియానికి చేరుకోవచ్చని వివరించారు. మ్యాచ్‌ ముగిసిన కొద్ది గంటల తర్వాత ఈ రైళ్లు అహ్మదాబాద్‌ నుంచి తిరిగి బయల్దేరుతాయని, దాని వల్ల అభిమానులు అదే రోజు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.