ETV Bharat / sports

సెమీస్​ మ్యాచ్​కు​ 5.3 కోట్ల లైవ్ స్ట్రీమింగ్ - డిస్నీ+హాట్​స్టార్​ సరికొత్త రికార్డ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 4:52 PM IST

Updated : Nov 16, 2023, 6:41 PM IST

IND Vs NZ Semi Final Match Viewership
IND Vs NZ Semi Final Match Viewership

IND Vs NZ Semi Final Match Viewership : భారత్‌-న్యూజిలాండ్ సెమీస్‌ మ్యాచ్​.. రికార్డు స్థాయిలో వ్యూవర్​షిప్​ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ డిస్నీ+ హాట్‌స్టార్​లో 5.3 కోట్ల లైవ్ స్ట్రీమింగ్ దక్కించుకుంది.

IND Vs NZ Semi Final Match Viewership : 2023 వరల్డ్​కప్​ తొలి సెమీస్​లో భారత్.. న్యూజిలాండ్​ను ఓడించి టోర్నీలో ఫైనల్​కు చేరింది. ఆసాంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ .. ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేసింది. స్టేడియంలో ప్రత్యక్షంగా వేల మంది మ్యాచ్​ను వీక్షించగా.. కోట్లాది మంది పరోక్షంగా చూశారు. ఈ క్రమంలో​ అత్యధిక మంది లైవ్ స్ట్రీమింగ్ చేసిన మ్యాచ్​గా వరల్డ్​కప్ తొలి సెమీస్ నిలిచింది. ఈ మ్యాచ్​ను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఓ దశలో ఏకంగా 5.3 కోట్ల మంది లైవ్​లో చూశారు. తొలుత భారత్​ ఇన్నింగ్స్​ను 5.1 కోట్ల మంది చూడగా.. న్యూజిలాండ్​ లక్ష్య ఛేదనలో అత్యధికంగా 5. 3 కోట్ల మంది లైవ్​లో వీక్షించారు.

ఓటీటీ ప్లాట్​ఫామ్​ జియో సినిమా.. ఐపీఎల్​ మ్యాచ్​లను ఉచితంగా చూసే అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డిస్నీ+హాట్​స్టార్​ కూడా ప్రపంచకప్​లో ఇదే ఫాలో అవుతోంది. ఇందులో భాగంగానే ఎలాంటి సబ్​స్క్రిప్షన్​ అవసరం లేకుండా మ్యాచ్​లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. ఐపీఎల్​ చరిత్రలో చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ను లైవ్​లో 3.2కోట్ల మంది వీక్షించారు. మెగాటోర్నీ ప్రారంభం కాకముందు అత్యధిక వ్యూస్ పొందిన మ్యాచ్ అదే. అయితే ప్రస్తుత వరల్డ్​కప్​ లీగ్​ స్టేజ్​లో జరిగిన భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్​తో ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది. ఈ మ్యాచ్​ను 3.5 కోట్ల మంది స్ట్రీమింగ్ చేశారు. అయితే తాజా మ్యాచ్​తో ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.

World Cup 2023 Final : సెమీస్​కే ఈ విధంగా ఉంటే.. ఇక ఫైనల్​ మ్యాచ్​ ఎన్ని వ్యూస్ సాధిస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే టీమ్​ఇండియా ఫైనల్స్​కి వెళ్లినందున.. తుదిపోరు ఈ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు. నవంబర్​ 19న అహ్మదాబాద్​లో ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​లో భారత్.. రెండో సెమీస్ విజేతతో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే 2019 ప్రపంచకప్​లోనూ భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్​ను డిస్నీ+హాట్​స్టార్​లో అత్యధికంగా 2.5 కోట్ల మంది లైవ్​లో చూశారు.

షమీ @ 7 - కివీస్​ను దెబ్బకు దెబ్బ కొట్టిన రోహిత్ సేన - ఫైనల్స్​కు భారత్

ఫైనల్స్​లో తొలి అడుగు భారత్​దే - సెమీస్​లో కివీస్ చిత్తు

Last Updated :Nov 16, 2023, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.