ETV Bharat / sports

'పంత్​ కెప్టెన్​ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని'

author img

By

Published : Jun 22, 2022, 7:41 PM IST

rishabh pant captain
Madan Lal on Rishabh Pant

రిషభ్​ పంత్​ను కెప్టెన్​ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడినని చెప్పాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ మదన్​లాల్​. భారత జట్టుకు నాయకత్వం వహించాలంటే సాధారణ విషయం కాదని, అందుకు పంత్ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నాడు.

టీమ్​ఇండియా వికెట్​కీపర్​-బ్యాటర్​ రిషభ్ పంత్ కెప్టెన్​ అవ్వకుండా అడ్డుపడేవాడినని తెలిపాడు మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ సెలక్టర్ మదన్​లాల్. భారత జట్టుకు నాయకత్వం వహించడానికి బాధ్యత తెలిసి ఉండాలని, పంత్ ఇంకా కుర్రాడే అని అన్నాడు. పంత్ కెప్టెన్సీని ఎం.ఎస్ ధోనీ, విరాట్​ కోహ్లీ శైలితో పోలిస్తూ.. నాయకుడిగా పోటీలో ఉండాలంటే అతడికి ఇంకా కనీసం రెండేళ్లు అయినా పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో 2-2తో ముగిసిన 5మ్యాచ్​ల టీ20 సిరీస్​లో టీమ్​ఇండియాకు సారథ్యం వహించాడు పంత్.

"పంత్​ కెప్టెన్ అవ్వకుండా నేను కచ్చితంగా అడ్డుకునేవాడిని. ఎందుకంటే ఇలాంటి ఆటగాడికి ఆ బాధ్యతను ఇప్పుడే ఇవ్వకూడదు. టీమ్​ఇండియా కెప్టెన్సీ అంటే సాధారణ విషయం కాదు. పంత్​ ఇంకా కుర్రాడే. ఎక్కడికీ వెళ్లడు. ఆడే కొద్దీ అతడు పరిణతి చెందుతాడు. రాబోయే రెండేళ్లలో తన ఆటతీరును మరింత మెరుగు పరచుకుంటే అప్పుడు అతను మంచి సారథి కాగలడు. పరిపక్వతతో కూడిన నిర్ణయాలు తీసుకోగలడు. పంత్​ ఒక విభిన్న స్వభావం కలిగిన ఆటగాడు. ధోనీ కూల్ కెప్టెన్. కోహ్లీ అద్భుతమైన బ్యాటర్. పంత్​ దూకుడుగా ఆడకూడదని నేనడం లేదు. కానీ కొంచెం పరిణతితో ఆడితే బాగుంటుంది."

-మదన్​ లాల్, మాజీ క్రికెటర్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు పంత్. గాయం కారణంగా కేఎల్​ రాహుల్​ వైదొలగడం వల్ల ఈ పర్యటనకు తాత్కాలిక కెప్టెన్​గా అతడు ఎంపికయ్యాడు. ఈ సిరీస్​లో తొలి రెండు మ్యాచ్​ల్లో ఓడిపోయిన భారత్​.. తదుపరి రెండింట్లో గెలిచి సిరీస్​ను సమం చేసింది. కాగా, నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా రద్దు అయ్యింది.

ఇదీ చూడండి: Virat Kohli Covid: విరాట్ కోహ్లీకి కరోనా.. అక్కడికి వెళ్లిన తర్వాతే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.