ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​లో భారత్​పై పాక్​దే విజయం'

author img

By

Published : Oct 2, 2021, 4:48 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup) టీమ్​ఇండియాపై గెలిచే సత్తా పాకిస్థాన్​కు ఉందన్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్. బౌలింగ్​ తమకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నాడు .

T20 World Cup
టీ20 ప్రపంచకప్

భారత్​, పాకిస్థాన్​ ద్వైపాక్షిక సిరీస్​లు ఆడటంలేదు. దీంతో టీ20 ప్రపంచకప్​ (T20 World Cup) కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇరుదేశాల అభిమానులు. దుబాయ్​లో అక్టోబర్​ 24న ఆరంభంకానున్న ఈ టోర్నీలోని తొలి మ్యాచ్​లోనే ఇండియా, పాక్​ (Ind Vs Pak)తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ (T20 World Cup 2021) చరిత్రలో తొలిసారిగా భారత్​పై బాబర్​ అజామ్​ నేతృత్వంలోని పాకిస్థాన్​ జట్టు (Pakistan T20 World Cup Squad 2021) గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్.

"సామర్థ్యం మేరకు ఆడితే ఓపెనింగ్​ మ్యాచ్​లో టీమ్​ఇండియాను పాకిస్థాన్ ఓడించగలదని నిజంగా నమ్ముతున్నా. అది అంత సులువు కాదు. కానీ, దానిని సుసాధ్యం చేసే సమర్థవంతమైన క్రికెటర్లు మా (పాక్) జట్టులో ఉన్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్​ కాబట్టి ఇరు జట్లపై ఒత్తిడి ఉంటుంది. తొలి ఓవర్లు, ఆరంభంలో వచ్చే పరుగులే కీలకం. మంచి ప్రదర్శన చేస్తే తప్పక గెలుస్తాం."

- వకార్ యూనిస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్

వన్డే ప్రపంచకప్​తో పాటు, టీ20 ప్రపంచకప్​లోనూ (T20 World Cup) టీమ్​ఇండియాపై ఇప్పటివరకు ఒక్క విజయం నమోదు చేయలేదు పాక్ (Ind Vs Pak World Cup). ఇక తమకు బౌలింగ్ ప్రధాన ఆయుధంగా ఉందని చెప్పాడు యూనిస్. ఎలాంటి స్కోరునైనా కాపాడుకునే సామర్థ్యం ఉందని తెలిపాడు. ప్రస్తుత జట్టులో హసన్ అలీ అత్యుత్తమ బౌలర్​ అని, బౌలింగ్​లో అతడే నేతృత్వం వహిస్తాడని అన్నాడు.

ఇదీ చూడండి: T20 World Cup: పాక్​ జట్టుపై అఫ్రిది తీవ్ర అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.