హార్దిక్​ బౌలింగ్​ చేయకపోయినా పర్వాలేదు: కపిల్ దేవ్

author img

By

Published : Oct 19, 2021, 9:40 PM IST

kapil dev

భారత జట్టు ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్యాపై(Hardik Pandya News) కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev on Hardik Pandya). హార్దిక్​ బౌలింగ్​ చేయనంత మాత్రాన పొట్టి ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ఛాంపియన్​గా నిలిచే అవకాశాలు చేజారవని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్యా(Hardik Pandya News) ఫామ్​పై పలువురు సీనియర్​ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev on Hardik Pandya) కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ బౌలింగ్​ చేయకపోవడం వల్ల టీమ్​ఇండియాకు ఎలాంటి నష్టం జరగదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

"ఆల్​రౌండర్​ జట్టులో చాలా పెద్ద మార్పులకు కారణం అవుతాడు. హార్దిక్​ బౌలింగ్ చేయకపోవడం వల్ల టీమ్​ఇండియాకు టీ20 ప్రపంచకప్​లో పెద్ద నష్టం ఏమీ జరగదు. కానీ, కోహ్లీ ఎంచుకునే బౌలింగ్​ ఆప్షన్లలో మార్పు ఉంటుంది. ఆల్​రౌండర్​ బౌలింగ్, బ్యాటింగ్​ రెండూ చేయగలిగితే.. కెప్టెన్​కు బౌలర్లను ఎంచుకోవడం సులభం అవుతుంది."

-కపిల్ దేవ్, టీమ్​ఇండియా ఆల్​రౌండర్.

సచిన్​ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ బ్యాట్స్​మెన్​ అయినప్పటికీ.. నాలుగులో రెండు ఓవర్లైనా బౌలింగ్​ చేసేవారని కపిల్​ దేవ్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం హార్దిక్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్​ చేస్తే జట్టుకు బలం చేకూరుతుందని తెలిపాడు.

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ నేపథ్యంలో ఇంగ్లాండ్​తో వార్మప్​ మ్యాచ్​లో భాగంగా హార్దిక్​ పాండ్యా ఒక్క ఓవర్​ కూడా బౌలింగ్ చేయలేదు. మరోవైపు భువనేశ్వర్​ కూడా బౌలింగ్​ నైపుణ్యం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా బౌలింగ్​పై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం(అక్టోబర్ 20న) ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​ ఆడనుంది భారత్. అసలు పోరులో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్​తో తొలి మ్యాచ్​ ఆడనుంది.

ఇదీ చదవండి:

T20 WorldCup 2021: 'భారత్​ కంటే పాక్ మెరుగ్గా కనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.