ETV Bharat / sports

పాండ్యకు అంబానీల మర్యాద- గుర్రాలు, బ్యాండ్​ బాజాతో MI కెప్టెన్​కు గ్రాండ్ వెల్​కమ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 1:44 PM IST

Updated : Dec 27, 2023, 3:14 PM IST

Hardik Pandya Jamnagar
Hardik Pandya Jamnagar

Hardik Pandya Jamnagar Welcome : గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్య రీసెంట్​గా రిలయన్స్ ఇండస్ట్రీస్​ విజిట్​ కోసం గుజరాత్ వెళ్లాడు. అక్కడ పాండ్యకు గుర్రాలు, బ్యాండ్ బాజాతో ఘన స్వాగతం పలికారు.

Hardik Pandya Jamnagar Welcome : టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో పాండ్య రిలయన్స్ ఇండస్ట్రీస్ విజిట్​లో భాగంగా డిసెంబర్​ 19న గుజరాత్ జామ్​నగర్ వెళ్లాడు. అయితే అక్కడ పాండ్యకు ఘన స్వాగతం లభించింది. ఇండస్ట్రీ గేట్ బయట పాండ్యకు గుర్రాలు, బ్యాండ్ బాజాతో స్వాగతం పలికారు. అయితే ఆలస్యంగా వెలులోకి వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.

Hardik Pandya Ruled Out : టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య, 2024 జనవరిలో అఫ్గానిస్థాన్​తో జరగనున్న టీ20 సిరీస్​కు పూర్తిగా దూరం కానున్నాడు. 2023 వన్డే వరల్డ్​కప్​లో గాయపడిన హార్దిక్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోనందున అతడు ఇంకొన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు. అయితే మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్​కప్ ఉన్నందున హార్దిక్​ను ద్వైపాక్షిక సిరీస్​లు ఆడించడానికి బీసీసీఐ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

Hardik Pandya Mumbai Indians : ట్రేడింగ్​ పద్ధతిలో హార్దిక్ పాండ్య ఇటీవల గుజరాత్ టైటాన్స్​ నుంచి ముంబయి ఇండియన్స్​ జట్టులోకి వచ్చాడు. కాగా, అతడికి ఫ్రాంచైజీ యాజమాన్యం కెప్టెన్​గానూ బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న పాండ్య, 2024 ఐపీఎల్​లోనూ ఆడటం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.100 కోట్లు!
అయితే హార్దిక్ పాండ్య కోసం గుజరాత్ టైటాన్స్‌కు ముంబయి ఇండియన్స్ భారీ బదిలీ రుసుమును చెల్లించిందని తెలుస్తోంది. ఈ స్టార్ ఆల్‌రౌండర్ కోసం దాదాపు రూ.100 కోట్లు చెల్లించిందని సమాచారం. 2021 ఐపీఎల్‌లో భాగం కావడానికి గుజరాత్ టైటాన్స్ సీవీసీ క్యాపిటల్‌గా రూ.5625 కోట్లు వెచ్చించింది. అయితే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ బలమైనది. ముంబయి ఫ్రాంచైజీలో వ్యాపార దిగ్గజాలు ఉన్నారు.

రూ.15కోట్లు పెరిగిన పర్స్ వ్యాల్యూ
హార్దిక్ పాండ్య వదులుకోవడంతో ఐపీఎల్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ పర్స్ వ్యాల్యూ రూ.15 కోట్లు పెరిగింది. కానీ ముంబయి బదిలీ రుసుము ఎంత మొత్తం చెల్లించిందనే విషయం ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో సీవీ క్యాపిటల్‌ బ్యాలెన్స్ షీట్‌లో అది కనిపించనుంది

రోహిత్ కెప్టెన్సీలో స్టార్లుగా మారిన క్రికెటర్లు- పాండ్యనే ఫస్ట్!!

2024 IPLకు హార్దిక్ డౌటే!- ఆందోళనలో ముంబయి ఫ్రాంచైజీ!

Last Updated :Dec 27, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.