ETV Bharat / sports

రోహిత్ కెప్టెన్సీలో స్టార్లుగా మారిన క్రికెటర్లు- పాండ్యనే ఫస్ట్!!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 8:46 PM IST

Players Under Rohit Captaincy : ఐపీఎల్​లో కొన్ని సీజన్లపాటు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడి, ప్రస్తుతం టీమ్ఇండియలో కీలకంగా మారిన ప్లేయర్లు వీళ్లే!

Players Under Rohit Captaincy
Players Under Rohit Captaincy

Players Under Rohit Captaincy : ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ అనేక మంది ప్లేయర్లకు మంచి ప్లాట్​ఫామ్​గా నిలిచింది. ప్రస్తుత టీమ్ఇండియాలో పలువురు కీలక ఆటగాళ్లు ఐపీఎల్​లో ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. ఇక 10 సీజన్​లపాటు జట్టును నడిపిన రోహిత్​ను తప్పించి, ఆ బాధ్యతలు ఇటీవల హార్దిక్​కు అప్పగించింది ఫ్రాంచైజీ యాజమాన్యం. అయితే హార్దిక్ సహా పలువురు ప్లేయర్లు, రోహిత్ శర్మ సారథ్యంలోనే ఐపీఎల్​లో ముంబయి తరఫున అరంగేట్రం చేసి నేడు జాతీయ జట్టులో కీలక ప్లేయర్​గా ఎదిగారు.

  1. హార్దిక్ పాండ్య : హార్దిక్ పాండ్య 2015లో ఐపీఎల్​ అరంగేట్రం చేశాడు. ఆల్​రౌండర్​గా ముంబయికి అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్. రోహిత్ కెప్టెన్సీలో ముంబయిలో అదరగొట్టిన హార్దిక్​కు 2016లో టీమ్ఇండియా పిలుపు అందింది. అలా ఇంటర్నేషనల్ లెవెల్​లోనూ అదరగొట్టి, ప్రస్తుతం టీమ్ఇండియా టీ20 కెప్టెన్​ దాకా ఎదిగాడు హార్దిక్ పాండ్య.
  2. జస్ప్రీత్ బుమ్రా : జస్ర్పీత్ బుమ్రా 2013లో ఐపీఎల్​లో ముంబయితోనే ఎంట్రీ ఇచ్చాడు. తొలినాళ్లలో బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి, చాలా మంది కామెంట్ చేశారు. దీంతోపాటు ఐపీఎల్​లో తొలి మూడు సీజన్​లలో బుమ్రా పెద్దగా రాణించలేదు. ఇక 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బుమ్రా, ఈ ఏడాది ఐర్లాండ్​ పర్యటనలో టీమ్ఇండియాకు సారధ్యం వహించాడు.
  3. సూర్యకుమార్ యాదవ్ : 2012లో ఐపీఎల్​లో ముంబయితోనే అరంగేట్రం చేసిన సూర్య కొంతకాలానికే కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుకు ట్రేడయ్యాడు. ఆ జట్టులో సూర్యకు పెద్దగా పేరురాలేదు. ఇక 2018లో తిరిగి మళ్లీ ముంబయిలోకి వచ్చిన తర్వాతే సూర్య టాప్ ప్లేయర్​గా ఎదిగాడు. 2021లో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసి ఏడాదిలోనే టీ20 ర్యాంకింగ్స్​లో నెం.1 అయ్యాడు. దీంతో తాజాగా సౌతాఫ్రికా పర్యటనలో టీ20 కెప్టెన్​గా అవకాశం దక్కింది.
  4. ఇషాన్ కిషన్ : 2016లో గుజరాత్ లయన్స్​ జట్టుతో ఐపీఎల్​లో పరిచయం అయ్యాడు ఇషాన్ కిషన్. ఇక 2018 సీజన్​లో ముంబయి ఇషాన్​ను కొలుగోలు చేసింది. ఐపీఎల్​లో సత్తా చాటడం వల్ల ఇషాన్​కు టీమ్ఇండియా పిలుపు అందింది. ప్రస్తుతం 25 ఏళ్ల ఇషాన్ జట్టులో కీలక ప్లేయర్​గా ఎదుగుతున్నాడు.
  5. తిలక్ వర్మ : 21 ఏళ్ల తిలక్ వర్మను ముంబయి ఫ్రాంచైజీ 2022 వేలంలో దక్కించుకుంది. ముంబయి తరఫున రెండు సీజన్లు ఆడిన తిలక్, రోహిత్ ప్రోత్సాహంతో అతి తక్కువ రోజుల్లోనే టీమ్ఇండియలోకి వచ్చాడనడంలో సందేహం లేదు. ఈ ఏడాది జరిగిన ఆసియా కప్, ఆసియా గేమ్స్​, పలు ద్వైపాక్షిక సిరీస్​ల్లో తిలక్ ఎంపికయ్యి రాణించాడు.
  • Rohit Sharma said "Our Scouts has done a great work, lots of credit to them as many have played for India who came from Mumbai Indians". pic.twitter.com/LPdBDXQ2ls

    — Johns. (@CricCrazyJohns) May 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టెస్ట్ సిరీస్​ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్

రోహిత్‌ కెప్టెన్సీని MI అసలెలా వదులుకుంది? కోహ్లీ 'కామెంట్స్'​ గుర్తున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.