ETV Bharat / sports

ఇంగ్లాండ్​కు ఐసీసీ షాక్​- 5 కాదు 8 పాయింట్లు కోత

author img

By

Published : Dec 18, 2021, 8:34 AM IST

England WTC Points: మందకొడి బౌలింగ్​ కారణంగా ఇంగ్లాండ్​కు డబ్ల్యూటీసీ పాయింట్లలో విధించిన కోతను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీ. ఇటీవల విధించిన ఐదు పాయింట్ల కోతను ఎనిమిదికి పెంచుతున్నట్లు పేర్కొంది.

england wtc points
ఇంగ్లాండ్​కు ఐసీసీ షాక్

England WTC Points: ఆస్ట్రేలియాతో యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో మందకొడి బౌలింగ్ కారణంగా ఇంగ్లాండ్​కు ఎనిమిది డబ్ల్యూటీసీ (వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్​) పాయింట్ల కోత పడింది. ఇంతకుముందు ఇంగ్లాండ్​కు మ్యాచ్​ ఫీజులో 100 శాతం జరిమానా పాటు అయిదు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత విధించింది. అయితే ఒక రోజు ఆటలో వేయాల్సిన కనీస ఓవర్ల ప్రమాణాన్ని అందుకోలేనప్పుడు ఆ జట్టు ఎన్ని తక్కువ ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు పెనాల్టీగా వేయాలి. ఆ నిబంధన ప్రకారం ఆ జట్టుకు ఎనిమిది పాయింట్ల కోత పడింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్​ టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ 0-1తో వెనుకంజలో ఉంది. మరోవైపు కంగారూలు రెండో టెస్టులో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఇదీ చూడండి : ట్రాఫిక్​ పోలీస్​కు థ్యాంక్స్​ చెప్పిన సచిన్​.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.