ETV Bharat / sports

న్యూజిలాండ్​-భారత్​ టెస్టులో కరీబియన్​ అతిథి

author img

By

Published : Feb 23, 2020, 2:36 PM IST

Updated : Mar 2, 2020, 7:19 AM IST

Chris Gayle highlighted
న్యూజిలాండ్​-భారత్​ టెస్టులో కరీబియన్​ అతిథి

వెల్లింగ్టన్​ వేదికగా జరుగుతున్న భారత్​-కివీస్​ టెస్టు మ్యాచ్​లో ప్రేక్షకుల గ్యాలరీలో సందడి చేశాడు వెస్టిండీస్​ విధ్వంసకర వీరుడు క్రిస్​గేల్. అభిమానుల మధ్యలో కూర్చొని మ్యాచ్​ చూశాడు. కాసేపు కామెంటరీ చేస్తూ అలరించడం విశేషం.

యూనివర్సల్ బాస్​ క్రిస్​ గేల్​.. తాజాగా న్యూజిలాండ్​-భారత్ మధ్య​ టెస్టు మ్యాచ్​ ప్రత్యక్షంగా వీక్షిస్తూ సందడి చేశాడు. అభిమానులతో కలిసి వీక్షకుల గ్యాలరీలో కూర్చొని అలరించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

Chris Gayle highlighted in Wellington Test
మైదానంలో వ్యాఖ్యాతతో మాట్లాడుతున్న గేల్​

333 రింగ్​ చూశారా?

క్రిస్​గేల్.. ప్రపంచ క్రికెట్​లో తనదైన ఆటతో అభిమానులను సృష్టించుకున్నాడు. ఫ్యాషన్​ దుస్తులతోనూ మెరుస్తుంటాడు. తాజాగా శనివారం తన పేరు, బొమ్మ ఉన్న బంగారపు ఉంగరాన్ని ఆవిష్కరించాడు. లిమిటెడ్​ ఎడిషన్​ పేరిట అభిమానుల కోసం దీన్ని విడుదల చేశాడు. ఈ ఉంగరంపై అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 333, పేరు క్రిస్​గేల్​(సీజీ), యూనివర్సల్ బాస్ టైటిల్​తో పాటు వెనక భాగంలో సంతకం కూడా ముద్రించి ఉంది.

2019 మార్చిలో చివరి టీ20 ఆడిన గేల్​.. ప్రస్తుతం పలు దేశాల్లో టీ20 లీగ్​ల్లో ఆడుతున్నాడు. ఇటీవల కరీబియన్​ లీగ్​లో ఆడిన ఇతడు.. త్వరలో నేపాల్​లో జరగనున్న ఎవరెస్ట్​ ప్రీమియర్​ లీగ్​(ఈపీఎల్​), ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లోనూ కనువిందు చేయనున్నాడు.

ఈపీఎల్​ ఫిబ్రవరి 29న కాఠ్మాండు వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో ఫోక్రా రైనోస్​ జట్టు తరఫున ఆడనున్నాడు గేల్​. అంతేకాకుండా మార్చి 29 నుంచి మొదలు కానున్న ఐపీఎల్​లోనూ కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు తరఫున బరిలో దిగనున్నాడు.

Last Updated :Mar 2, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.