ETV Bharat / sports

'ధోనీ రాకతో ఈసారి ఐపీఎల్​ మరింత స్పెషల్​'

author img

By

Published : Sep 16, 2020, 3:39 PM IST

ఐపీఎల్​లో ధోనీ బ్యాటింగ్​ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని భారత మాజీ క్రికెటర్​ వీరేందర్ సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబరు 19న చెన్నై ప్రారంభ మ్యాచ్​ ముంబయితో ఆడనుంది.

dhoni
ధోనీ

ఈసారి ఐపీఎల్​ మరింత ప్రత్యేకమని మాజీ క్రికెటర్​ వీరేందర్ సెహ్వాగ్​ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్​కు ఇటీవల రిటైర్మెంట్​ ప్రకటించిన ధోనీ.. కొన్ని నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతుండటమే ఇందుకు కారణమని అన్నాడు. భారత్​లో క్రికెట్​ అంతర్భాగమని చెప్పిన సెహ్వాగ్.. లీగ్​ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నాడు.

Sehwag
సెహ్వాగ్​

ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు ధోనీ. యూఏఈ వేదికగా జరగబోయే ఈ లీగ్​లో చెన్నై సూపర్ ​కింగ్స్​కు కెప్టెన్​గా మహీ ఉన్నాడు. సెప్టెంబరు 19న అబుదాబీ వేదికగా తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది చెన్నై సూపర్​కింగ్స్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.