ETV Bharat / sports

ఐపీఎల్​ ఆడనందుకు బాధపడట్లేదు: రైనా

author img

By

Published : Jan 3, 2021, 8:52 AM IST

Suresh Raina opens up on pulling out of IPL 2020
ఐపీఎల్​ ఆడనందుకు బాధపడట్లేదు: రైనా

గత సీజన్​లో ఆడకపోవడం గురించి సురేశ్ రైనా మాట్లాడాడు. తానేం చింతించట్లేదని అన్నాడు. కుటుంబానికి పూర్తి సమయం కేటాయించానని తెలిపాడు.

దాదాపు రెండు నెలల తర్వాత ఐపీఎల్​లో ఆడకపోవడం​ గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడాడు. గత సీజన్​లో పాల్గొనందుకు తానేం బాధపడట్లేదని చెప్పాడు. ఆ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో ఆస్వాదించానని అన్నాడు. చెన్నై సూపర్​కింగ్స్​తో యూఏఈకి వెళ్లిన రైనా.. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్​లు ప్రారంభం కాకముందే తిరిగి స్వదేశానికి వచ్చేశాడు.

Suresh Raina opens up on pulling out of IPL 2020
చెన్నై సూపర్​కింగ్స్ జెర్సీలో సురేశ్ రైనా

"ఈ విషయంలో బాధపడాల్సింది ఏముంది. నా పిల్లలు, కుటుంబంతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదించాను. పంజాబ్​లో జరిగిన ఓ సంఘటన తర్వాత నా కుటుంబం నన్ను కావాలనుకుంది. అందుకోసమే స్వదేశానికి వచ్చేశాను. ఆట ఎప్పుడైనా ఆడొచ్చు. కానీ కుటుంబం అవసరం వచ్చినప్పుడు వాళ్లకు మనం కావాలి. అప్పుడు నేను సరైన పనే చేశాను" -సురేశ్ రైనా, టీమ్​ఇండియా క్రికెటర్

సీఎస్కే జట్టుతో ఇప్పటికీ టచ్​లో ఉన్నానని, గత సీజన్​ మ్యాచ్​లను టీవీలో చూడటం చాలా ఇబ్బందిగా అనిపించిందని రైనా చెప్పాడు. ఇతడి గైర్హాజరీ.. చెన్నై జట్టు వరుస ఓటములకు ఓ కారణమైంది. దీంతో ఐపీఎల్​ చరిత్రలోనే తొలిసారి లీగ్​ దశను దాటలేకపోయింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి సీజన్​ను ముగించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.