ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్కు అనారోగ్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ప్రస్తుతం అతడు ఉంటున్న హోటల్ రూమ్లోనే స్వీయనిర్బంధంలో ఉంటున్నాడని తెలిపింది. ప్రస్తుతం జరుగుతోన్న సన్నాహక మ్యాచ్ నుంచి ఈసీబీ అతడిని తప్పించింది.
"ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ గతరాత్రి నుంచి డయేరియాతో బాధపడుతున్నాడు. గురువారం మధ్యాహ్నానికి కొంచెం కోలుకున్నాడు. ముందు జాగ్రత్తగా వైద్యులు అతడికి కరోనా పరీక్ష చేసి పర్యవేక్షిస్తున్నారు. సామ్ ప్రస్తుతం హోటల్ రూమ్లో స్వీయనిర్బంధంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్లో అతడు పాల్గొనడం లేదు".
- ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
ఇంట్రా-స్క్వాడ్ సన్నాహక మ్యాచ్ తొలిరోజు 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు సామ్ కరన్. ఇంగ్లాండ్ జట్టు ప్రాక్టీసులో భాగంగా ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ కార్యకలాపాలు మొదలయ్యే క్రమంలో జులై 8 నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి... 'నేను చూశా.. ధోనీలో జోరు ఏమాత్రం తగ్గలేదు'