ETV Bharat / sports

కోచ్​ కాలేకపోయినా కీలక పదవి పొందాడు!

author img

By

Published : Aug 23, 2019, 6:09 PM IST

Updated : Sep 28, 2019, 12:32 AM IST

టీమిండియా ప్రధాన కోచ్​ పదవికి పోటీ పడి నిరాశ ఎదుర్కొన్న మైక్​ హెసన్​... కీలక బాధ్యతలు దక్కించుకున్నాడు. కోహ్లీ నాయకత్వం వహిస్తోన్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు డైరెక్టర్​ ఆఫ్​ క్రికెటర్​ ఆపరేషన్స్​(డీసీఓ)గా ఎంపికయ్యాడు.

కోహ్లీ జట్టులో హెసన్​కు డైరెక్టర్​ పదవి

ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్ జట్టు​ ప్రధాన కోచ్​ బాధ్యతలకు గుడ్​బై చెప్పిన మైక్​ హెసన్​.. మళ్లీ ఇదే లీగ్​లో కనిపించనున్నాడు. అయితే ఇప్పటి నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)జట్టుకు సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్‌కు సంబంధించి ముందుగానే ప్రణాళిక రచిస్తోన్న ఆర్సీబీ.. మైక్‌ హెసన్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌(డీసీఓ)గా ఎంపిక చేసింది.

cricket operations
మైక్​ హెసన్

ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ హెసన్‌కు నిరాశ ఎదురైంది. మరోసారి రవిశాస్త్రినే కోచ్‌గా కొనసాగించేందుకు సెలక్టర్లు మొగ్గుచూపడం వల్ల హెసన్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఆర్సీబీ ప్రధాన కోచ్‌గా ఆసీస్‌కు చెందిన సైమన్‌ కటిచ్‌ను ఎంపిక చేసింది. ఫలితంగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశాడీ మాజీ క్రికెటర్​.

ఇదీ చూడండి...'జాంటీ రోడ్స్​ను అందుకే ఎంపిక చేయలేదు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 12:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.