ETV Bharat / sports

పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు స్పాన్సర్​ కష్టాలు!

author img

By

Published : Jul 7, 2020, 6:15 AM IST

PCB struggling to find team sponsors amid COVID-19 pandemic
పాకిస్థాన్​ క్రికెట్​ జట్టుకు స్పాన్సర్​ కష్టాలు!

ఇంగ్లాండ్​తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్​ కోసం కొత్త స్పాన్సర్​ను వెతికే పనిలో పడింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు. ఓ పానీయ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఇటీవలే ముగిసినా.. కరోనా కారణంగా చాలా తక్కువ మొత్తంలో తిరిగి ఆ సంస్థ టెండర్​ వేసిందని పీసీబీ అధికారి వెల్లడించాడు.

కరోనా కారణంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఇంగ్లాండ్​తో జరిగే సిరీస్​ కోసం స్పాన్సర్​ను వెతకడంలో విఫలమైంది. పాక్​ జట్టు​ లోగో స్పాన్సర్​షిప్​ ఒప్పందంపై సంతకం చేయడానికి ఓ పానీయ సంస్థతో చర్చలు కొనసాగుతున్నాయని ఓ పీసీబీ అధికారి తెలిపాడు. సదరు సంస్థ విశ్లేషకుల అంచనాల కంటే చాలా తక్కువ మొత్తానికి టెండర్​ వేసిందని తెలుస్తోంది.

"పానీయాల సంస్థతో పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఒప్పందం ఇటీవలే ముగిసింది. పాకిస్థాన్​ జాతీయ జట్టుకు సంబంధించిన ప్రధాన లోగో స్పాన్సర్​షిప్​ ఒప్పందం కోసం తాజాగా వేలానికి ఆహ్వానించాం. కానీ, ఆ పానీయ సంస్థ తప్ప ఎవరూ వేలంలో పాల్గొనలేదు. ఇది మా ముందున్న సమస్య. కానీ, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా బహుళజాతి కంపెనీలూ తీవ్రంగా నష్టపోయాయని అర్థమవుతుంద"ని పీసీబీ అధికారి వెల్లడించాడు.

బ్రాడ్​కాస్ట్​ ఒప్పందం

పాక్​ జట్టు స్పాన్సర్​షిప్​ కోసం పానీయ సంస్థ ఆ దేశ క్రికెట్​ బోర్డుకు గతంలో చెల్లించిన మొత్తంలో 35 శాతం నుంచి 40 శాతమే టెండర్​ వేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్​ క్రికెట్​ మ్యాచ్​ల ప్రసారదారు టెన్​స్పోర్ట్స్​తో కుదుర్చుకున్న నాలుగేళ్ల ఒప్పందం కూడా ఇటీవలే ముగిసింది. పాక్​లో అంతర్జాతీయ హోమ్​ సిరీస్​ హక్కులను కొనుగోలు చేయడానికి కొత్త బ్రాడ్​కాస్టర్​ను వెతకడంలోనూ బోర్డు సమస్యలను ఎదుర్కుటోంది.

అలా అయితే కష్టమే!

ఇంగ్లాండ్​తో సిరీస్​ ప్రారంభానికి ముందే తమకు స్పాన్సర్​ లభిస్తారని పీసీబీ ఆశాజనకంగా ఎదురుచూస్తోంది. కొత్త స్పాన్సర్​ను రాకపోతే ఆటగాళ్ల వార్షిక వేతనంలో సుమారు 75 శాతం కోత ఉండొచ్చు.

ఇదీ చూడండి... 'కోహ్లీపై విరుద్ధ ప్రయోజనాల ఆరోపణల్లో నిజం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.