ETV Bharat / sports

ఆర్సీబీకి శుభవార్త.. జట్టుతో కలిసిన పడిక్కల్

author img

By

Published : Apr 7, 2021, 12:16 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్​ దేవ్​దత్​ పడిక్కల్ బయోబబుల్​లో జట్టుతో కలిశాడు. మార్చి 22న కరోనా బారినపడిన ఇతడు ఇటీవలే కోలుకున్నాడు. దీంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈరోజు జట్టుతో కలిశాడు.

Padikkal
దేవ్​దత్ పడిక్కల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. ఈ జట్టు యువ ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్ ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నాడు. తాజాగా అతడు జట్టుతో కలిశాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో ఈ నెల 9న జరిగే తొలిపోరులో ఇతడు ఆడనున్నాడు.

"రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెఫ్ట్యాండ్ బ్యాట్స్​మన్ దేవ్​దత్ పడిక్కల్ జట్టుతో కలిశాడని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ తేలడం వల్ల బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు జట్టుతో కలిశాడు."

-ఆర్సీబీ ట్వీట్

మార్చి 22న దేవ్​దత్​కు కరోనా సోకినప్పటి నుంచి క్వారంటైన్​లో ఉన్నాడు. ఇటీవలే నెగిటివ్​గా తేలడం వల్ల జట్టుతో కలిశాడు.

గత సీజన్​లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు దేవ్​దత్. ఈ టోర్నీలో 15 మ్యాచ్​ల్లో 473 పరుగులు సాధించాడు. అలాగే అరంగేట్రంలోనే 400కి పైగా పరుగులు సాధించిన రెండో క్రికెటర్​గా గుర్తింపు పొందాడు.

డేనియల్​కు కరోనా

దేవ్​దత్ పడిక్కల్ జట్టుతో కలవగా.. ఈ జట్టు ఆల్​రౌండర్ డేనియల్ సామ్స్​ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ తెలిపింది.

ఇవీ చూడండి: ఐపీఎల్​ను వీడని కరోనా.. ఆర్సీబీ ఆటగాడికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.