ETV Bharat / sports

టీమ్ఇండియాకు షాక్.. పంత్, జడేజాకు గాయం

author img

By

Published : Jan 9, 2021, 12:03 PM IST

టీమ్ఇండియా క్రికెటర్లను గాయాల బెడద వీడడం లేదు. సిడ్నీ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో​ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా, పంత్​లు గాయపడ్డారు. రెండో ఇన్నింగ్స్​లో పంత్​కు సబ్​స్టిట్యూట్​గా సాహా కీపింగ్ చేస్తున్నాడు.

Jadeja left thumb injured, Rishabh Pant hit on elbow, taken for scans as Saha dons gloves
జడేజా, పంత్​లకు గాయం.. కీపర్​గా సాహా

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా, యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ గాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా కమిన్స్‌ వేసిన బంతి పంత్ ఎడమ చేతికి గట్టిగా తగిలింది. దీంతో అతడు విలవిల్లాడాడు. వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించినా నొప్పిని భరించలేకపోయాడు. కాసేపటికే హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్‌ వార్నర్‌ చేతికి చిక్కి పంత్ ఔటయ్యాడు.

అనంతరం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో‌ 244 పరుగులకు ఆలౌటయ్యాక.. పంత్‌ను స్కానింగ్‌ చేయించేందుకు తరలించినట్లు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ ఆరంభించగా, పంత్‌ స్థానంలో సాహా కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు.

జడేజాకూ గాయం

జడేజా కూడా తొలి ఇన్నింగ్స్​ బ్యాటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్​ వేసిన షార్ట్​ పిచ్ బంతి అతడి ఎడమ చేతి బొటనవేలుని గాయపరిచింది. స్వల్ప వైద్య చికిత్స అనంతరం అతడు బ్యాటింగ్ కొనసాగించినా.. తర్వాత తీవ్రత ఎక్కువవడం వల్ల ఫీల్డింగ్​కు రాలేదు. ఇదే విషయమై స్పందించిన బీసీసీఐ జడేజానూ స్కానింగ్​ కోసం ఆస్పత్రి తరలించినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 244 ఆలౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.