ETV Bharat / sports

ఆ జట్టు​ నాకు ఇల్లు లాంటిది: ఉమేశ్ యాదవ్

author img

By

Published : Apr 1, 2021, 4:46 PM IST

దిల్లీ జట్టులోకి తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ సీజన్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు కృషి చేస్తానని అంటున్నాడు. ఏప్రిల్ 10న దిల్లీ క్యాపిటల్స్, తన తొలి మ్యాచ్​లో చెన్నైతో తలపడనుంది.

IPL 2021: Umesh Yadav happy to play for Delhi Capitals again
ఆ జట్టు​ నాకు ఇల్లు లాంటిది: ఉమేశ్ యాదవ్

భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.. దిల్లీ క్యాపిటల్స్​ బృందంతో కలిశాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్​ కోసం ప్రాక్టీసు ప్రారంభించాడు. ఈ ఫ్రాంచైజీ తన ఇల్లు లాంటిదని, జట్టులో చాలామంది క్రికెటర్లతో ఇప్పటికే ఆడి ఉండటం వల్ల కొత్తగా అనిపించట్లేదని ఆసక్తికర అన్నాడు.

ఉమేశ్, ఐపీఎల్​ కెరీర్​ను దిల్లీ డేర్​డెవిల్స్​తోనే(అప్పటి దిల్లీ జట్టు పేరు) ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో ఇతర జట్లలో ఆడిన ఇతడు.. దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి దిల్లీ జట్టులోకి రావడంపై ఆనందం వ్యక్తం చేశాడు. దిల్లీ క్యాంప్​లో తను చాలా సౌకర్యంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మొత్తంగా ఇప్పటివరకు లీగ్​లో 121 మ్యాచ్​లాడి 119 వికెట్లు తీశాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఉమేశ్​ను కనీస ధర రూ.1 కోటికి కొనుగోలు చేసింది దిల్లీ క్యాపిటల్స్​. గాయంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​, ఈ సీజన్​కు దూరమవగా.. పంత్​ కొత్త సారథిగా వ్యవహరించనున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.