ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

author img

By

Published : Dec 8, 2020, 1:12 PM IST

Updated : Dec 8, 2020, 1:19 PM IST

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది భారత్. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన టీమ్​ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.

IND vs AUS T20
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

వన్డేల్లో ఓడినా సరే టీ20ల్లో చెలరేగుతున్న టీమ్​ఇండియా.. 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్​ను సొంతం చేసుకుంది. ఇరుజట్లు మధ్య నామమాత్రపు మూడో మ్యాచ్​ నేడు జరుగుతోంది. ఇందులో గెలిచి​ సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయాలని కోహ్లీసేన చూస్తుండగా, పరువు నిలబెట్టుకోవాలని ఆసీస్ ప్రణాళికలు వేస్తోంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

గాయం కారణంగా రెండో టీ20కి దూరంగా ఉన్న సారథి ఫించ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఫలితంగా స్టోయినిస్ బెంచ్​కే పరిమితమయ్యాడు. భారత జట్టులో మార్పులేమీ చేయలేదు.​

ఆస్ట్రేలియా

ఫించ్ (కెప్టెన్), వేడ్, స్మిత్, మ్యాక్స్​వెల్, డీఆర్సీ షార్ట్, హెన్రిక్స్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్, స్వెప్సన్, టై, జంపా

భారత్

రాహుల్, ధావన్, కోహ్లీ (కెప్టెన్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, నటరాజన్, చాహల్

Last Updated : Dec 8, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.