ETV Bharat / sports

కెప్టెన్ కోహ్లీ.. అందరికంటే ముందే బుడగలోకి

author img

By

Published : Nov 7, 2020, 5:20 PM IST

ఐపీఎల్​ పాల్గొన్న భారత ఆటగాళ్ల కంటే ముందే.. ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన కొత్త బుడగలోకి ప్రవేశించాడు కోహ్లీ. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

Virat Kohli
కోహ్లీ

ఆస్ట్రేలియాతో పర్యటనకు సిద్ధమైన టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. మిగిలిన ఆటగాళ్ల కంటే బీసీసీఐ ఏర్పాటు చేసిన కొత్త బయో బబుల్​లోనికి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐపీఎల్​లో భాగస్వామ్యం కానీ టెస్టు ఆటగాళ్లు పుజారా, విహారి బుడగలోకి ప్రవేశించిన ప్రాక్టీస్​ సెషన్​ ప్రారంభించేశారు.

"ఐపీఎల్​లో హైదరాబాద్​తో ఎలిమినేటర్​ మ్యాచ్​ పూర్తయిన రోజే.. అదే రాత్రి బయోబబుల్​లోకి కోహ్లీ అడుగుపెట్టాడు. ఒకటి లేదా రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ప్రాక్టీసు మొదలుపెడతాడు" అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

నవంబరు 10వ తేదీన ఐపీఎల్​ ఫైనల్​ పూర్తవుతుంది. 12వ తేదీన జట్టులోని 32 మంది ఆటగాళ్లతో కలిసి టీమ్​ఇండియా ప్రత్యేక విమానంలో​ సిడ్నీ చేరుకుని, అక్కడే ఏర్పాటు చేసిన క్వారంటైన్​లోకి వెళ్తుంది.

నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్​ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టు జరగనున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.