ETV Bharat / sports

భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లకు వేదికలు ఖరారు

author img

By

Published : Oct 21, 2020, 7:18 PM IST

Sydney
భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​కు సిడ్నీ ఆతిథ్యం!

భారత్​-ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్​లకు వేదికలు ఖరారయ్యాయి. సిడ్నీ, కాన్​బెర్రా వేదికగా మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.

నవంబర్​లో జరగబోయే ఆస్ట్రేలియా-భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​లకు.. సిడ్నీ, కాన్​బెర్రా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మైదానాల్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి ఇరుజట్లు.

ఆసీస్​ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా తొలుత సిడ్నీకి చేరుకోనుంది. అక్కడే పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్​లో పాల్గొంటుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా అక్కడే నిర్బంధంలో ఉండనున్నారు.

అనంతరం వీరంతా సిరీస్​లో పాల్గొంటారు. ఈ విషయాన్ని న్యూ సౌత్​ వేల్స్​ క్రీడా శాఖ మంత్రి స్టువర్ట్​ యైర్స్​ తెలిపారు. దీనిపై తాము, క్రికెట్​ ఆస్ట్రేలియా బోర్డు చర్చించుకున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి ద్రౌపదిగా సౌందర్య.. 'నర్తనశాల' లుక్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.