ETV Bharat / sports

బోర్డులో వివాదం.. ఇంగ్లాండ్​తో సిరీస్ సందేహమే!

author img

By

Published : Nov 14, 2020, 10:58 AM IST

దక్షిణాఫ్రికా బోర్డులో అంతర్గత సమస్యలు తీవ్రమవతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్​తో సిరీస్​ రద్దయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

England's tour of South Africa at risk of being cancelled
సౌతాఫ్రికా బోర్డులో వివాదం.. ఇంగ్లాండ్​ పర్యటన ఉంటుందా?

ఇంగ్లాండ్​ జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరడానికి సిద్ధమవుతోంది. కానీ, దక్షిణాఫ్రికా క్రికెట్​(సీఎస్​ఏ) బోర్డులో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్​ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఎటు తేలడం లేదు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వివాదం ఏంటి?

సీఎస్​ఏలో 9 మందితో కూడిన మధ్యంతర బోర్డును ఆ దేశ క్రీడాశాఖ మంత్రి నతీ తెత్వా రెండు వారాల కింద నియమించారు. దీనికి మాజీ న్యాయమూర్తి జాక్​ యాకూబ్​ నేతృత్వం వహించనున్నారు. కానీ, దీన్ని గుర్తించడానికి సీఎస్​ఏ మండలి సభ్యులు నిరాకరిస్తున్నారు. దాంతో.. బోర్డు మొత్తాన్నే రద్దు చేస్తానని హెచ్చరించారు మంత్రి. "ఇంగ్లాండ్​ ఏం ఆలోచిస్తోందో తెలియదు. మండలిలోని సభ్యులు సాయంత్రానికల్లా సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఇంగ్లాండ్​ జట్టు రాకను అనుమతించబోమని" జాక్​ యాకూబ్​ అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య ఇంగ్లాండ్​ పర్యటన మొత్తం రద్దయ్యే ప్రమాదముందని సీఎస్​ఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:ఆస్ట్రేలియా గడ్డపై భారత్​ దూసుకెళ్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.