ETV Bharat / sports

భారత్​తో సిరీస్​ కోసం ఇంగ్లాండ్​​​ జట్టులోకి ఒలీ పోప్​

author img

By

Published : Feb 4, 2021, 8:05 AM IST

భారత్​తో జరుగనున్న టెస్టు సిరీస్​లో భాగంగా.. ఇంగ్లాండ్​ మరో ఆటగాణ్ని తమ జట్టులోకి తీసుకుంది. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ ఒలీ పోప్​ను టీమ్​లోకి తీసుకుంటున్నట్లు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు ప్రకటించింది.

England for the series with India Oli Pope into the team
భారత్​తో సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ జట్టులోకి ఒలీ పోప్​

భారత్​తో నాలుగు మ్యాచ్​ల సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ మరో ఆటగాణ్ని జట్టులో చేర్చుకుంది. మిడిల్ ఆర్డర్​ బ్యాట్స్​మెన్ ఒలీ పోప్​ బుధవారం జట్టులోకి వచ్చాడు. 23 ఏళ్ల పోప్​.. నిరుడు ఆగస్టులో పాకిస్థాన్​తో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. భుజానికి శస్త్రచికిత్స అవసరమైంది. గాయం నుంచి కోలుకున్న అతడు.. ఇంగ్లాండ్​ జట్టులో లేకున్నా ఆ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లాడు.

భారత్​కూ వచ్చిన అతడు ఇంగ్లాండ్​ జట్టుతో పాటు ప్రాక్టీస్​ చేస్తున్నాడు. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు తెలిపింది. తొలి టెస్టులో పోప్​ ఆడే అవకాశముంది.

ఇదీ చదవండి: 'పంత్ ఆట సెహ్వాగ్​ను తలపిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.