ETV Bharat / sports

భారత్​-ఇంగ్లాండ్​ 5 టెస్టుల షెడ్యూల్​ ఇదే..

author img

By

Published : Nov 18, 2020, 5:12 PM IST

Updated : Nov 18, 2020, 8:30 PM IST

వచ్చే ఏడాది క్రికెట్​ ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు ఇంగ్లాండ్​ బోర్డు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్​- భారత్​ జట్ల మధ్య టెస్టు సిరీస్​కు తేదీలను ఖరారు​ చేసింది.

eng vs india
భారత్​-ఇంగ్లాండ్​ 5 టెస్టుల షెడ్యూల్​ ఇదే..

కరోనా తర్వాత క్రికెట్​ పుంజుకుంటోంది. వరుస టోర్నీలతో అన్ని దేశాల ఆటగాళ్లు బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్​.. మరో రసవత్తర పోరుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. స్వదేశంలో భారత్​-ఇంగ్లాండ్​ మధ్య ఐదు టెస్టుల సిరీస్​కు ఓకే చెప్పింది ఇంగ్లీష్​ బోర్డు. వచ్చే ఏడాది జూన్​లోనే టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇరు దేశాల మధ్య ఈ మ్యాచ్​లు ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో కీలకంగా ఉండనున్నాయి.

అభిమానుల సమక్షంలోనే...

కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి అభిమానుల మధ్యే మ్యాచ్​లు నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​. జనవరి 12 నుంచి టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మ్యాచ్​లు రద్దయినా, కరోనా కారణంగా వేదిక మారినా డబ్బులు వాపస్​ చేస్తామని స్పష్టం చేశారు.

షెడ్యూల్​ ఇదే..

మ్యాచ్తేదీలువేదిక
తొలి టెస్టుఆగస్టు 4-8ట్రెంట్​ బ్రిడ్జ్​
రెండో టెస్టుఆగస్టు 12-16లార్డ్స్
మూడో టెస్టుఆగస్టు 25-29ఎమరాల్డ్​ హడ్డింగ్లే
నాలుగో టెస్టుసెప్టెంబర్​ 2-6కియా ఓవల్​
ఐదో టెస్టుసెప్టెంబర్​ 10-14ఎమిరేట్స్​ ఓల్డ్​ ట్రాఫోర్డ్​
Last Updated : Nov 18, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.