ETV Bharat / sports

IPL 2022 Teams: కొత్త​ టీమ్​ల టెండర్​​ గడువు పొడిగింపు

author img

By

Published : Sep 22, 2021, 7:41 AM IST

Updated : Sep 22, 2021, 7:52 AM IST

ఐపీఎల్​ 15వ(IPL 2022 Teams) సీజన్​ కోసం రెండు కొత్త ఫ్రాంచైజీలను లీగ్​లోకి చేర్చేందుకు కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన టెండర్​ డాక్యుమెంట్​ గడువును పొడిగిస్తున్నట్లు బీసీసీఐ(BCCI News) ప్రకటించింది.

BCCI
బీసీసీఐ

వచ్చే ఐపీఎల్​ సీజన్(IPL 2022 Teams) నుంచి రెండు కొత్త ఫ్రాంచైజీలను లీగ్​లోకి తీసుకురావాలని యోచిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI Latest News)..మంగళవారం ఓ ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన 'ఇన్విటేషన్​ టు టెండర్​'ను(ఐటీటీ) అక్టోబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఈ ఏడాది ఆగస్టు 31న ఐపీఎల్(IPL Auction date) గవర్నింగ్ కౌన్సిల్ టెండర్​ డాక్యుమెంట్​ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పలు సంస్థలు కోరినందున ఐటీటీ చివరితేదీని పొడిగిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. రూ.10 లక్షల టెండర్ ఫీజు చెల్లించన వారికి ఐటీటీ అందుబాటులో ఉంటుందని జై షా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:ఐపీఎల్​-15 బ్లూప్రింట్ రెడీ.. మెగా వేలం అప్పుడే!

Last Updated : Sep 22, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.