ETV Bharat / sports

థాయ్​లాండ్​ బ్యాడ్మింటన్ క్వార్టర్స్​లో సింధు

author img

By

Published : Jan 22, 2021, 12:22 AM IST

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​ ​టోర్నీలో భారతీయ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. మలేసియా క్రీడాకారిణి కిసోనా​ని.. పీవీ సింధు 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్​లో అడుగుపెట్టింది. టోర్నీ మొదటి రౌండ్​లోనే మాజీ ప్రపంచ నంబర్​వన్​ సైనా నెహ్వాల్​ను ఓడించిన థాయ్​ల్యాండ్​ నాలుగో సీడ్​ రచనోక్​తో సింధు తలపడనుంది.

Thailand Open: Sindhu through to quarter-finals
థాయ్​లాండ్​ బ్యాడ్మింటన్ క్వార్టర్స్​లో సింధు

థాయ్​లాండ్​ ఓపెన్ సూపర్​-1000​ బ్యాడ్మింటన్​ ​టోర్నీలో భారతీయుల హవా కొనసాగుతోంది. మలేసియా క్రీడాకారిణి కిసోనా సెల్వదురయ్​ను పీవీ సింధు 35 నిమిషాలలోనే 21-10, 21-12 తో ఓడించి క్వార్టర్​ ఫైనల్​లో అడుగుపెట్టింది. థాయ్​లాండ్​ నాలుగో సీడ్​ రచనోక్​​ ​ లేదా దక్షిణ కొరియా క్రీడాకారిణి హ్యుంగ్​ జీ సంగ్​తో సింధు తలపడనుంది.

అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్​లో దక్షిణ కొరియా 7వ సీడ్​ జోడీ సోల్​ గ్యు చోయ్​, సెయుంగ్​ జె సియో​ పై భారత డబుల్స్​ జంట సాత్విక్​ సాయిరాజ్​, చిరాగ్​ శెట్టీ 21-18, 23-21 తేడాతో ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​కు చేరారు.

కాగా భారత షట్లర్ వర్మ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అంతకు ముందు మలేసియా 8వ సీడ్​ లీ జీ జియాను ఓడించిన వర్మ.. క్వార్టర్​ ఫైనల్స్​లో డెన్మార్క్​ క్రీడాకారుడిని 21-12, 21-9తో సునాయసంగా ఓడించాడు. 40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్​లో 20 నిమిషాలలోపే ఆటపై వర్మ పట్టు సాధించాడు. సెమీ ఫైనల్లో అడుగు పెట్టాలంటే ప్రపంచ నంబర్ మూడో ఆటగాడు అండర్స్​ అంటోన్​సెన్​ను వర్మ ఓడించాలి.

అటు మిక్స్​డ్​ డబుల్స్​లోనూ భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. జర్మనీ ప్రత్యర్థుల్ని 22-20, 14-21, 21-16తో సాత్విక్​ సాయి రాజ్​, అశ్విని పొన్నప్ప మట్టికరిపించారు. సెమీస్​లో బెర్త్​కోసం మలేసియా పెంగ్ సూన్​, గో లీ యింగ్​తో తలపడనున్నారు.

అయితే హెచ్​ఎస్ ప్రణయ్​ మాత్రం నిరాశ పరిచాడు. డారేన్​పై 17-21, 18-21 తేడాతో ఓడిపోయాడు.

ఇదీ చూడండి: భారత్​తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్​​ జట్టు ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.