ETV Bharat / sports

థాయ్​ ఓపెన్​: ప్రణీత్​కు కరోనా.. శ్రీకాంత్​​ ఔట్​

author img

By

Published : Jan 20, 2021, 10:06 AM IST

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొన్న భారత స్టార్​ షట్లర్​ సాయి ప్రణీత్​కు కరోనా సోకింది. దీంతో అతడు టోర్నీ మధ్యలోనే వైదొలగాల్సి వచ్చింది. పది రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనున్నాడు. అతడితో సన్నిహితంగా ఉన్న కారణంగా.. కిదాంబి శ్రీకాంత్​ కూడా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.

sri
శ్రీకాంత్​

థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొన్న భారత్​ స్టార్​ షట్లర్​ సాయి ప్రణీత్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ మధ్యలోనే నిష్కమించాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పది రోజులు పాటు క్వారంటైన్​లో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య స్పష్టం చేసింది.

బుధవారం ప్రణీత్.. తొలి రౌండ్​లో డారెన్​ లీ(మలేసియా)తో తలపడాలి. అయితే ప్రణీత్​ వైదొలగడం వల్ల 'లీ'కు వాకోవర్​ లభించింది. మరోవైపు ప్రణీత్​తో కిదాంబి శ్రీకాంత్​ సన్నిహితంగా ఉండటం వల్ల అతడు కూడా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.

టొయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ తొలి రౌండ్​లో మంగళవారం.. స్థానిక ఆటగాడు థమ్మాసిన్​పై 21-11,21-11తో నెగ్గి రౌండ్​ రౌండ్​లోకి ప్రవేశించాడు శ్రీకాంత్​.

ఇదీ చూడండి : థాయ్​లాండ్​​ ఓపెన్​లో సింధు, శ్రీకాంత్​ శుభారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.